
రాజస్థాన్లోని థార్ ఎడారి నడిబొడ్డున ఒక నిర్జీవమైన గ్రామం కనిపిస్తుంది. అదే కుల్ధారా. 1825వ సంవత్సరంలో ఒకే ఒక్క రాత్రిలో 84 గ్రామాలకు చెందిన దాదాపు 1500 మంది ప్రజలు ఇక్కడి నుంచి మాయమైపోయారు. ఇళ్లు, గుడులు, బావులు అన్నీ అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. కానీ వెళ్తూ వెళ్తూ, "ఈ మట్టిపై ఇక ఎవరు కూడా ఇళ్లు కట్టుకుని బతకలేరు" అని ఒక ఘోరమైన శాపం పెట్టారు. ఆ శాపం వల్లనే 180 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు అక్కడ ఒక్క రాత్రి కూడా ఎవరూ గడపలేకపోయారు. ఇక్కడి గైడ్లు సైతం సాయంత్రం కాగానే పారిపోతారు. పర్యాటకులకు పగటిపూట కూడా ఇక్కడ ఏదో తెలియని భయంకరమైన ఫీలింగ్ కలుగుతుంది. రాజస్థాన్లోని కుల్ధారా గ్రామం జైసల్మేర్ నగరానికి కేవలం 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. టాక్సీలో వెళ్తే 30 నిమిషాలు పడుతుంది. కానీ సాయంత్రం 6 గంటల తర్వాత ఇక్కడి ప్రభుత్వ గేట్లు మూసివేస్తారు. ఎందుకంటే, రాత్రి కాగానే అక్కడ మాయమైన వారంతా తిరిగి వస్తారని స్థానికుల నమ్మకం. పాడుబడ్డ ఇళ్ల మధ్య నుంచి ఏడుపులు, కాళ్ల శబ్దాలు, వింత నీడలు కనిపిస్తాయని చెబుతారు. 180 ఏళ్లుగా ఈ గ్రామం ఎందుకు ఖాళీగా ఉందో మీకు తెలుసా? స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. 1825వ సంవత్సరంలో జైసల్మేర్ రాజ్యానికి దీవాన్గా సలీం సింగ్ అనే వ్యక్తి ఉండేవాడు. అతడు అత్యంత క్రూరుడు, విలాసవంతుడు, అధికార పిశాచి. కుల్ధారా గ్రామంలో పాలివాల్ బ్రాహ్మణులు నివసించేవారు. వీరు 1291లో ఈ గ్రామాన్ని నిర్మించుకున్నారు. ఎడారి ప్రాంతంలో కూడా వ్యవసాయం, వ్యాపారాలు చేస్తూ దీనిని ఒక బంగారు గ్రామంగా మార్చుకున్నారు. నీటి సంరక్షణ కోసం వారు వాడిన టెక్నాలజీ వల్ల థార్ ఎడారిలో కూడా పంటలు పండేవి. అయితే, ఈ దీవాన్ సలీం సింగ్ కన్ను ఆ గ్రామ పెద్ద కూతురిపై పడింది. ఆమె చాలా అందంగా ఉండేది. ఆమెను పెళ్లి