
ఆధ్యాత్మిక యాత్రలు చేయాలనుకునే భక్తులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక క్రేజీ గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ బడ్జెట్లో దేశంలోని మోస్ట్ పాపులర్ పుణ్యక్షేత్రాలను చుట్టేయడానికి "భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు" ద్వారా ఒక సూపర్ ప్యాకేజీని లాంచ్ చేసింది. "5 జ్యోతిర్లింగ యాత్ర విత్ ద్వారకాధీశ్ టెంపుల్ అండ్ ఎల్లోరా" పేరుతో సాగే ఈ స్పెషల్ టూర్ ఏకంగా 10 రాత్రులు, 11 రోజుల పాటు సాగనుంది. 2026 జూలై 11న ప్రారంభమయ్యే ఈ జర్నీ జూలై 21న ముగుస్తుంది. ఈ స్పెషల్ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు మధ్యప్రదేశ్లోని రేవా స్టేషన్ నుండి జూలై 11వ తేదీ లేట్ ఈవెనింగ్ బయలుదేరుతుంది. అయితే ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ పలు బోర్డింగ్, డీ-బోర్డింగ్ పాయింట్లను కేటాయించింది. భక్తులు రేవాతో పాటు సత్నా, మైహర్, కట్ని, జబల్పూర్, నార్సింగ్పూర్, ఇటార్సీ, రాణి కమలపతి, షుజల్పూర్, ఉజ్జయిని, రత్లాం స్టేషన్లలో ఈ రైలు ఎక్కవచ్చు. అలాగే తిరుగు ప్రయాణంలో ఖాండ్వా, ఇటార్సీ, నార్సింగ్పూర్, జబల్పూర్, కట్ని, మైహర్, సత్నా, రేవా స్టేషన్లలో దిగిపోవచ్చు. ఈ టూర్ ప్లాన్ చాలా ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేశారు. కేవలం ఒకే ఒక్క టికెట్తో భారతదేశంలోని విభిన్న సంస్కృతులు, చరిత్ర, ఆధ్యాత్మికతను ఎక్స్ప్లోర్ చేయవచ్చు. • ద్వారక: ద్వారకాధీశ్ ఆలయం, బేట్ ద్వారక, నాగేశ్వర మహాదేవ్ జ్యోతిర్లింగం. • సోమనాథ్: ప్రసిద్ధ సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయం. • ఛత్రపతి సంభాజీనగర్ (ఔరంగాబాద్): ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగంతో పాటు వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన ఎల్లోరా గుహలు. • జూలై 11, 12: రేవాలో ట్రెయిన్ స్టార్ట్ అవుతుంది. వివిధ స్టేషన్లలో భక్తులు బోర్డింగ్ అవుతారు. ఓవర్నైట్ జర్నీ ఉంటుంది. • జూలై 13, 14: ద్వారక చేరుకుంటారు. అక్కడ ద్వారకాధీశ్, బేట్ ద్వారక, నాగేశ్వర ఆలయాలను సందర్శిస్తారు. జూలై 14 రాత్రి సోమనాథ్ బయలుదేరుతారు. •