
UK Social Media Ban: ఆన్లైన్ ప్రపంచంలో పెరుగుతున్న ప్రమాదాల నుండి చిన్నారులను రక్షించేందుకు బ్రిటన్ (UK) ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు వయసున్న పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఆ దేశ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ సోమవారం అధికారికంగా ప్రకటించారు. డిజిటల్ యుగంలో పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడటం, వారి భద్రతను పటిష్టం చేయడంతో పాటు వారికి ఆహ్లాదకరమైన బాల్యాన్ని తిరిగి అందించడమే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. డౌనింగ్ స్ట్రీట్లో జరిగిన మీడియా సమావేశంలో ప్రధాని స్టార్మర్ మాట్లాడుతూ.. “మన పిల్లల భవిష్యత్తును పాడుచేస్తున్న ప్రస్తుత డిజిటల్ వ్యవస్థకు స్వస్తి పలకాల్సిన సమయం వచ్చింది. ఈ కఠిన నిర్ణయం ద్వారా చిన్నారులకు వారి అమూల్యమైన బాల్యాన్ని తిరిగి ఇస్తున్నాం” అని స్పష్టం చేశారు. టెక్ దిగ్గజాల వ్యాపార ధోరణుల నుండి పిల్లలను కాపాడుతూ, వారు సురక్షితమైన వాతావరణంలో పెరిగేలా ఈ నిషేధం దోహదపడుతుందని ఆయన వివరించారు. read also: Russian attack on Ukraine : ఉక్రెయిన్పై రష్యా దాడి..9 మంది మృతి ఇప్పటికే ఆస్ట్రేలియా దేశం విజయవంతంగా అమలు చేస్తున్న విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని బ్రిటన్ ఈ సరికొత్త పాలసీని రూపొందించింది. ఈ నూతన చట్టం ప్రకారం.. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టిక్టాక్, యూట్యూబ్, స్నాప్చాట్, ఎక్స్ (ట్విట్టర్) వంటి ప్రధాన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో 16 ఏళ్లలోపు వారికి అకౌంట్లు తెరిచే అవకాశం ఉండదు. వీటితో పాటు లైవ్ స్ట్రీమింగ్స్ చూడటం, అపరిచితులతో చాటింగ్ చేయడం వంటి ఫీచర్లపై కూడా కఠినమైన ఆంక్షలు ఉంటాయి. కాగా, ఈ చట్టాన్ని తీసుకురావడానికి ముందు ప్రభుత్వం జరిపిన సర్వేలో దాదాపు 90 శాతం మంది తల్లిదండ్రులు ఈ నిషేధానికి పూర్తి మద్దతు పలకడం విశేషం. ఈ నిర్ణయాన్ని బ్రిటన్కు చెందిన పలు స్వచ్ఛంద సంస్థలు (NSPCC వంటివి) హర్షిస్తున్నాయి. చిన్నారుల రక్షణలో

