
పశ్చిమ బెంగాల్ లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ముఖ్యమంత్రి సువేందు అధికారి సారథ్యంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం తన తొలి పూర్తిస్థాయి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి స్వపన్ దాస్గుప్తా కొద్దిసేపటి కిందటే బడ్జెట్ ప్రతిపాదనలను సభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో ఉపాధి కల్పన, సంక్షేమం, భద్రత, పారిశ్రామిక వృద్ధిని సమపాళ్లలో మిళితం చేసినట్టు కనిపించింది. వికసిత్ బంగ్లాను నిర్మించడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదనలు రూపొందించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.రూ. 8.15 లక్షల కోట్ల అప్పు..గత ప్రభుత్వంలో రూ. 8.15 లక్షల కోట్ల అప్పులు ఉన్నట్లు మంత్రి ప్రస్తావించారు. ఆర్థికంగా ఇటువంటి భారీ సవాలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజానీకంపై ఎటువంటి అదనపు పన్నుల భారాన్ని మోపకుండా ఆదాయ వనరులను పెంచుకోవడమే తమ ప్రధాన వ్యూహమని పేర్కొన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రజా సంక్షేమ పథకాలన్నింటినీ యథాతథంగా కొనసాగిస్తామని, దాంతో పాటు కొత్త ప్రాజెక్టులతో నూతన ప్రగతి వైపు పరుగు తీయిస్తామని వెల్లడించారు.లక్ష ఉద్యోగాల భర్తీ..బడ్జెట్లో ఉపాధి రంగానికి అత్యంత ప్రాధాన్యత కల్పించారు. అనేక ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న సుమారు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. దీంట్లో 33 శాతం ఉద్యోగాలను మహిళలకే కేటాయించనున్నారు. దీంతో పాటు విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు 50,000 ఉపాధ్యాయ పోస్టులు, శాంతిభద్రతల పరిరక్షణ కోసం మరో 20,000 పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించారు.డీఏ 20 శాతం మేర పెంపు..ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరటనిచ్చేలా డీఏను ఏకంగా 20 శాతం మేర పెంచుతున్నట్లు స్వపన్ దాస్ గుప్తా ప్రకటించారు. ఈ తాజా పెంపుతో ఉద్యోగుల మొత్తం డీఏ అర్హత 38 శాతానికి చేరుకోనుంది. పెరిగిన జీతాల భత్యాలు ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుండి అమల్లోకి వస్తాయి. మరోవైపు నిరుపేద కుటుంబాలకు సత్వర సేవలు అందించే గ్రామీణ పోలీస్ సిబ్బంది, సివిక్ వాలంటీర్లు, హోంగార్డులు, గ్రీన్ పోలీస్ సిబ్బందికి ఇచ్చే