ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శ్రీకాళహస్తిలో పర్యటించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం, ఆయన స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ విందు సమావేశానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.అంతకుముందు సుధీర్ రెడ్డి నివాసానికి చేరుకున్న లోకేష్కు కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లోకేష్ పెద్దల పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ పాదాలకు నమస్కరించి ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. ఈ ఆత్మీయ దృశ్యం అక్కడున్న వారిని విశేషంగా ఆకట్టుకుంది.ఈ భేటీ సందర్భంగా లోకేష్ పార్టీ నేతలను ఆప్యాయంగా పలకరించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై వారితో చర్చించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు పులివర్తి నాని, గాలి భానుప్రకాష్, మురళీ మోహన్, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు, ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, తిరుపతి జిల్లా పార్టీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మీ, సుగుణమ్మ, షణ్ముగం రెడ్డి, డాలర్ దివాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Actor ProfilePolitician
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంట్లో లోకేష్.. ఆత్మీయ విందు సమావేశం
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
AP7AM•29 Aug 2026
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంట్లో లోకేష్.. ఆత్మీయ విందు సమావేశం