
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న తారక్.. ఆ తర్వాత ‘దేవర’తో సోలోగా బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో నిరూపించారు. ఆ వెంటనే వచ్చిన ‘వార్-2’ రిజల్ట్ కాస్త నిరాశపరిచినా.. ఫ్యాన్స్కు మాత్రం ఒకే ఒక్క ప్రాజెక్ట్ మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి.. అదే ‘డ్రాగన్’. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న తారక్ (Tarak).. ఆ తర్వాత ‘దేవర’ (Devara)తో సోలోగా బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో నిరూపించారు. ఆ వెంటనే వచ్చిన ‘వార్-2’ (War 2) రిజల్ట్ కాస్త నిరాశపరిచినా.. ఫ్యాన్స్కు మాత్రం ఒకే ఒక్క ప్రాజెక్ట్ మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి.. అదే ‘డ్రాగన్’ (Dragon). ‘కెజియఫ్, సలార్’ వంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ యాక్షన్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్గా మారారు. నిజానికి ఈ ఏడాదే డ్రాగన్ థియేటర్లలోకి వస్తుందని ప్రేక్షకులంతా ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ, కొన్ని అనుకోని కారణాల వల్ల, షూటింగ్ డిలే కావడంతో ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. అయితే ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ‘డ్రాగన్’ సినిమా లేట్ అవ్వడానికి అసలు కారణం.. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) మాస్టర్ ప్లానే అని తెలుస్తోంది. ఈ సినిమాను సింగిల్ పార్ట్గా కాకుండా, ఏకంగా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట. సాధారణంగా ఒక సినిమాకు ఫస్ట్ పార్ట్ వచ్చి, సెకండ్ పార్ట్ రావడానికి కనీసం రెండు మూడేళ్లకు పైగానే టైమ్ పడుతుంది. కానీ ‘డ్రాగన్’ విషయంలో అలా జరగకుండా, ఎలాంటి డిలే లేకుండా రెండు పార్టులను బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేయడానికి మేకర్స్ పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. మొదటి పార్ట్ రిలీజ్ అయిన కేవలం ఆరు నెలల గ్యాప్ లోనే సెకండ్ పార్ట్ను దించేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకే అనుకున్న దానికంటే షూటింగ్