
ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా కమర్షియల్ సినిమాలు చేస్తూనే కొన్ని ప్రయోగాత్మక పాత్రలు కూడా ఎంచుకుంటున్నారు. తన పాత్రల ఎంపిక విషయంలో ఐశ్వర్యరాజేష్ సెలెక్టివ్ గా ఉంటున్నారు. ఏ పాత్రలు పడితే వాటిని ఓకె చేయడం లేదు. తాజాగా ఐశ్వర్య రాజేష్, సముద్రఖని, నరేష్ అగస్త్, రాజా చేంబోలు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ఇసకపట్నం. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. మొత్తం ఇది 7 ఎపిసోడ్ ల వెబ్ సిరీస్. ప్రైమ్ వీడియోలో ఈ రాత్రి నుంచి స్టీమింగ్ మొదలైంది. ఐశ్వర్య రాజేష్, సముద్రఖనితో పాటు కీలకంగా అనిపించే పాత్రలు ఈ సిరీస్ లో చాలానే ఉన్నాయి. నరేష్ అగస్త్య, సుధాకర్ కొమాకుల, సునీల్, బనెర్జీ, రవి వర్మ కీలక పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. ఇసకపట్నం వెబ్ సిరీస్ అనేది ఇసకపట్నం తీరప్రాంతం, పోర్ట్ ఏరియాలో 1980, 1990 టైం పీరియడ్ లో జరిగే కథ. సముద్రఖని సాధారణ కూలీగా బతుకుదెరువు కోసం ఇసుకపట్నం పోర్ట్ ఏరియాకి భార్య కూతురితో వెళతాడు. సముద్రఖని పాత్ర పేరు నాయుడు. అతడు క్రూరమైన వ్యక్తిత్వం గలవాడు. ఆ ప్రాంతంలో సిన్నరావు( రాజీవ్ కనకాల) అనే లోకల్ లీడర్ ఉంటారు. మత్సకారుల సమస్యలు పరిష్కరిస్తూ మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటాడు. ఊహించని పరిస్థితుల్లో నాయుడు.. సిన్నరావుని హత్య చేసి ఒక్కసారిగా పోర్ట్ ఏరియాని గ్రిప్ లోకి తెచ్చుకుని డాన్ గా ఎదుగుతాడు. ఆ తర్వాత పోర్ట్ ఏరియాలు వ్యాపారాలు, స్మగ్లింగ్, రౌడీయిజంతో డబ్బు, పవర్ సంపాదిస్తాడు. అతడికి రైట్ హ్యాండ్ గా బెనర్జీ ఉంటారు. తండ్రి చేసే అక్రమాలు, రౌడీయిజం అంటే కూతురు భారతి(ఐశ్వర్య రాజేష్) కి ఇష్టం ఉండదు. అలాగని తండ్రి పనులకు అడ్డు రాదు. ఆమె ఒక ఎన్జీవో సంస్థకు విరాళాలు ఇస్తూ పేద వారికి సాయం