
Jonnagiri Sand Mining:త్వరలోనే సిఎం చేతుల మీదుగా ‘జొన్నగిరి గోల్డ్మెన్’ ప్రారంభం రూ.50వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా నూతన ‘బీచ్ సాండ్ పాలసీ’ రాష్ట్ర మైనింగ్, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడి. గత వైసిపి ప్రభుత్వ అనాలోచిత, అడ్డగోలు నిర్ణయాల వల్ల సర్వనాశనమైన రాష్ట్ర మైనింగ్ రంగాన్ని కూటమి ప్రభుత్వం కేవలం రెండేళ్లలో విప్లవాత్మక సంస్కరణల ద్వారా తిరిగి పట్టాలెక్కించిందని రాష్ట్ర మైనింగ్, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్ల పాలనా లోపాల వల్ల మైనింగ్ వృద్ధి రేటు 24నుంచి 7శాతానికి పడిపోయి, రాష్ట్ర ఖజానాకు ఏకంగా రూ.19,137 కోట్ల నష్టం వాటిల్లిందని గణాంకాలతో సహా శ్వేతపత్రం విడుదల చేశారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హాయాంలో జరిగిన భారీ ఇసుక దోపిడిని తాము శాటిలైట్ డేటా ఆధారంగా సాంకేతికంగా నిరూపించామని, 5.08కోట్ల మేజర్ మెట్రిక్ టన్నుల ఇసుకను అక్రమంగా తరలించినందుకు గాను రూ.3,891 కోట్ల రికవరీ డిమాండ్ నోటీసులు జారీ చేశామని ప్రకటించారు. ఈ కుంభకోణంపై ఇప్పటికే రాష్ట్రంలో ఎసిబి కేసులు ఎఫ్ఐఆర్లు నమోదు కాగా, ప్రస్తుతం ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలో దిగి లోతైన దర్యాప్తు జరుపుతోందని మంత్రి స్పష్టంచేశారు. 2023లో విపరీతమైన డిమాండ్ ఉన్న “సెలికా సాండ్” రంగాన్ని దౌర్జన్యంగా లాక్కొని పారదర్శక ఆన్లైన్ ఐడీలను బ్లాక్ చేసి కేవలం 20లీజులను “వామనా ఎంటర్ప్రైజెస్” అనే సిండికేట్కు కట్టబెట్టడం వల్లే రాష్ట్రంలోని సిమెంట్ ఫ్యాక్టరీలు పక్క రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వచ్చిందని మంత్రి మండిపడ్డారు. Read also: AP SSC Supplementary Results 2026: AP 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. మీ రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి! ఈ అక్రమాలకు పూర్తి చెక్ పెడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన వెంటనే ప్రజలపై భారం మోపే