
మన దేశం, మన భూమి.. ఇండియాలో ఎక్కడికైనా వెళ్లే హక్కు మనకు రాజ్యాంగం ఇచ్చింది అని మనం అనుకుంటాం. కానీ భారత దేశ పటంలో కొన్ని రెడ్ లైన్ ఏరియాలు ఉన్నాయి. అక్కడికి భారతీయులు వెళ్లడం పూర్తిగా నిషేధం. విచిత్రం ఏంటంటే, అదే ప్రాంతాలకు విదేశీ పర్యాటకులు ప్రభుత్వ అనుమతితో హ్యాపీగా తిరుగుతారు, ఫోటోలు కూడా తీసుకుంటారు. వినడానికి చాలా షాకింగ్గా ఉన్నా ఇది అక్షరాలా నిజం. భద్రత, ఆదివాసీల రక్షణ, సున్నితమైన సరిహద్దుల కారణంగా ఈ 5 ప్రాంతాలో భారతీయులకు ఎంట్రీ లేదు. • మొదటిది, జాతీయ భద్రత: చైనా, పాకిస్తాన్ సరిహద్దులకు ఆనుకుని ఉన్న ప్రాంతాలు చాలా సున్నితమైనవి. • రెండవది, ఆదివాసీల రక్షణ చట్టం: "అండమాన్ ఆదివాసీల రక్షణ నిబంధనలు 1956" ప్రకారం.. కొన్ని తెగలకు చెందిన వారితో బయటి ప్రపంచానికి ఎలాంటి సంబంధాలు ఉండకూడదు. ఎందుకంటే బయటి నుంచి వచ్చే వైరస్లు, వ్యాధుల వల్ల వారి జాతి మొత్తం అంతరించిపోయే ప్రమాదం ఉంది. • మూడవది, పర్యావరణ పరిరక్షణ: కొన్ని దీవులలో యాక్టివ్ అగ్నిపర్వతాలు, అరుదైన జంతువులు ఉన్నాయి. ప్రజలు ఎక్కువగా వస్తే అవి నాశనమవుతాయి. విదేశీయులకు RAP (Restricted Area Permit) లేదా PAP (Protected Area Permit) ద్వారా నియంత్రిత ప్రవేశం కల్పిస్తారు. కానీ సాధారణ భారతీయ పర్యాటకులకు మాత్రం ఇది పూర్తిగా క్లోజ్. ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత ఒంటరిగా జీవించే సెంటినెలీస్ అనే ఆదివాసీ తెగ వారు ఉంటారు. బయటి ప్రపంచానికి చెందిన మనుషులు ఎవరు కనిపించినా సరే.. వీరు బాణాలతో దాడి చేస్తారు. 2018 లో జాన్ అలెన్ చౌ అనే అమెరికన్ మిషనరీ ఇక్కడికి వెళ్లడానికి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు. అందుకే భారత ప్రభుత్వం ఈ ద్వీపానికి 5 నాటికల్ మైళ్ల దూరం వరకు వెళ్లకుండా నిషేధం విధించింది. విదేశీ పరిశోధకులు కూడా కేవలం దూరం నుండి డ్రోన్ల ద్వారా మాత్రమే