
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా ప్లాట్ఫార్మ్స్ ఇంక్ ఇండియాలో ఒక భారీ డీల్ కుదుర్చుకుంది. బెంగళూరుకు చెందిన ప్రముఖ ఫిన్టెక్ స్టార్టప్ 'క్రెడ్' (CRED) లో మెటా ఏకంగా సుమారు ₹8,550 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడితో క్రెడ్ కంపెనీలో మెటాకు దాదాపు 20 శాతం మైనారిటీ వాటా దక్కనుంది. ఈ డీల్ తర్వాత క్రెడ్ కంపెనీ మొత్తం విలువ సుమారు ₹38,000 కోట్లు చేరినట్లు అధికారిక ప్రెస్ నోట్ ద్వారా తెలిసింది. ఈ ఇన్వెస్ట్మెంట్తో పాటు మరో క్రేజీ అప్డేట్ ఏంటంటే.. క్రెడ్ ఫౌండర్ కునాల్ షా ఇప్పుడు వాట్సాప్ గ్లోబల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇప్పటివరకు ఈ పొజిషన్లో ఉన్న విల్ క్యాథ్కార్ట్ స్థానంలో కునాల్ షా రానున్నారు. క్రెడ్ కంపెనీని 2018లో కునాల్ షా స్టార్ట్ చేశారు. టైమ్కి క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టే కస్టమర్లకు రివార్డులు ఇచ్చే కాన్సెప్ట్తో వచ్చిన ఈ యాప్, ఆ తర్వాత లోన్లు, యూపీఐ పేమెంట్స్, రెంట్ పేమెంట్స్, బిల్ పేమెంట్స్, వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటూ చాలా స్పీడ్గా దూసుకెళ్లింది. ప్రస్తుతం క్రెడ్కు 1.7 కోట్ల మంది మెంబర్స్ ఉన్నారు. ఇండియాలో జరిగే మొత్తం క్రెడిట్ కార్డ్ బిల్లుల పేమెంట్స్లో 40 శాతం కంటే ఎక్కువ క్రెడ్ యాప్ ద్వారానే జరుగుతున్నాయి. అందుకే ఇది దేశంలోనే అత్యంత విలువైన ఫైనాన్షియల్ డేటా ప్లాట్ఫామ్గా మారింది. ఈ డీల్ ప్రకారం కునాల్ షా క్రెడ్ కంపెనీ రోజువారీ బాధ్యతల నుండి తప్పుకుని, కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్లో ఉన్న మెటా హెడ్క్వార్టర్స్కు షిఫ్ట్ అవుతారు. అక్కడ నుండి వాట్సాప్ను గ్లోబల్గా లీడ్ చేస్తారు. మెటాకు ప్రపంచవ్యాప్తంగా ఇండియానే అతిపెద్ద మార్కెట్. ఇక్కడ వాట్సాప్కు 50 కోట్ల కంటే ఎక్కువ మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా నెలకు 300 కోట్ల మంది యూజర్లను