
గ్రామీణ మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యేలా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) కృషి చేస్తోంది. ఇందులో భాగంగా మహిళా స్వయం సహా యక సంఘాలకు ప్రభుత్వం రుణ లక్ష్యం ఖరారు చేసింది. జిల్లాలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 23,977.65 లక్షల బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది - 2026-27 ఆర్థిక సంవత్సరానికి రుణ లక్ష్యం ఖరారు ఆసిఫాబాద్రూరల్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యేలా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) కృషి చేస్తోంది. ఇందులో భాగంగా మహిళా స్వయం సహా యక సంఘాలకు ప్రభుత్వం రుణ లక్ష్యం ఖరారు చేసింది. జిల్లాలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 23,977.65 లక్షల బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. వీటితో పాటు అదనంగా స్రీనిధి రుణాలు రూ. 123 కోట్ల రుణాలు మంజూరు చేసి మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రణాళిక రూపొందించారు. మహిళా సంఘాల కు బ్యాంకు లింకేజీ రుణాలను ప్రభుత్వం ఏటా అందిస్తోంది. జిల్లాలో 8,633 మహిళా సంఘాలు ఉన్నాయి. ఇందులో ఆర్హత కలిగిన సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేస్తారు. అయా గ్రూపు సభ్యులు చేపట్టే వ్యాపారం మేరకు రూ. లక్ష నుంచి రూ. 20 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తారు. చాలామంది మహిళలు కుటీర పరిశ్రమలు, కిరాణం, పిండిగిర్ని, టైలరింగ్, వ్యవసాయ రంగానికి సంబందించిన వ్యాపారాలు చేసుకొవడానికి రుణాలు తీసుకుంటారు. గతంలో తీసుకున్న రుణాల రికవరీ శాతం సక్రమంగా ఉన్న కారణంగా ఈ ఏడాది కూడా బ్యాంకర్లు త్వరగానే రుణాలు పంపిణీ చేసే అవకాశం ఉంది. గ్రూపు రుణాలే కాకుండా మహి ళలు వ్యక్తిగతంగా రూ. ఐదు లక్షల వరకు రుణం తీసుకునే అవకాశం ఉంది. వారు ఏ వ్యాపారం కోసం రుణం తీసుకుంటున్నారో వివరించాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా తీసుకునే రుణాలకు బృందం సభ్యులు పూచికత్తుగా ఉంటారు. మహిళా సంఘాలకు మంజూరు చేసిన