
Aadhaar Update: ఆధార్ వినియోగదారులకు UIDAI శుభవార్త తెలిపింది. ఆధార్లో ఈమెయిల్ వివరాలను అప్డేట్ చేసుకునే ప్రక్రియను డిసెంబర్ 31 వరకు ఉచితంగా అందిస్తోంది. ప్రస్తుతం రూ.75 ఛార్జీ ఉండగా, ఈ కాలంలో ఎలాంటి ఫీజు లేకుండా ఆధార్ మెంబర్ యాప్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. సరైన ఈమెయిల్, మొబైల్ వివరాలు ఉండటం వల్ల ఆధార్ సేవలను మరింత సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు. ఆధార్ కార్డు ప్రస్తుతం ప్రతి భారతీయుడికి అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రంగా మారింది. బ్యాంక్ ఖాతాలు, ప్రభుత్వ పథకాలు, మొబైల్ సిమ్, పాస్పోర్ట్ వంటి అనేక సేవలకు ఆధార్ తప్పనిసరిగా అవసరమవుతోంది. అందుకే ఆధార్లో ఉన్న వివరాలు ఎప్పటికప్పుడు సరిగా ఉండటం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ప్రజలకు ఒక శుభవార్త తెలిపింది. ఆధార్లో నమోదు చేసిన ఈమెయిల్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. సాధారణంగా ఆధార్ వివరాల్లో మార్పులు చేయాలంటే కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం యాప్ ద్వారా అప్డేట్ చేసుకునే వారికి రూ.75 వరకు ఛార్జీ పడుతోంది. అయితే UIDAI తాజా నిర్ణయం ప్రకారం వచ్చే నెల 1వ తేదీ నుంచి డిసెంబర్ 31 వరకు ఈ ఛార్జీలను పూర్తిగా మాఫీ చేసింది. దీంతో వినియోగదారులు ఎలాంటి ఫీజు చెల్లించకుండా తమ ఈమెయిల్ వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. ఈ సౌకర్యం కేవలం ఆధార్ మెంబర్ యాప్ ద్వారా చేసే అప్డేట్లకు మాత్రమే వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. ఆధార్లో సరైన ఈమెయిల్ ఐడీ నమోదు ఉండటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆధార్కు సంబంధించిన నోటిఫికేషన్లు, భద్రతా సమాచారం, అప్డేట్ల వివరాలు నేరుగా ఈమెయిల్కు చేరుతాయి. అలాగే ఆధార్ సేవలను ఉపయోగించే సమయంలో కూడా ఇది ఉపయోగపడుతుంది.అదే విధంగా ఆధార్కు మొబైల్ నంబర్ లింక్ అయి ఉంటే వివిధ సేవలకు సంబంధించిన ఓటీపీలు సులభంగా అందుతాయి