
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Son brutally kills mother over water dispute in pithapuram Kakinada: ఇటీవల కొంత మంది సమాజంలో సైకోలుగా ప్రవర్తిస్తున్నారు. కన్నవాళ్లు, కట్టుకున్న వాళ్లు అని కూడా చూడకుండా దాడులు చేస్తున్నారు. కొంత మంది తాగిన మైకంలో దాడులు చేస్తుంటే , మరికొంత మంది ఆర్థిక పరమైన గొడవలతో రక్తసంబంధాల్ని కూడా మర్చిపోతున్నారు. సొంత తల్లిదండ్రులు, కట్టుకున్న వాళ్లు అని కూడా చూడకుండా దాడులు చేయడం లేదా హత్యలు చేయడానికి కూడా వెనుకాడటంలేదు. ఈ క్రమంలో కన్నతల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎంతో కష్టపడి పెంచుతారు. తల్లి నవమాసాలు తన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుని బిడ్డను జన్మనిస్తుంది. తండ్రి తన పిల్లలకు ఏది అడిగిన లేదనకుండా ఇవ్వడానికి తన రెక్కలు ముక్కలు చేసుకుంటాడు. ఈ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ లోని పిఠాపురంలో చోటు చేసుకున్న ఘటన అసలు మానవత్వం ఉందా అన్న ప్రశ్నలను రేకెత్తిస్తుంది. కాకినాడలో జిల్లాలోని పిఠాపురం మండలంలోని చిత్రాడకు చెందిన పెంటా త్రిమూర్తులు, నాగమణి (45) దంపతులకు ఇద్దరు కుమారులు. త్రిమూర్తులు కూరగాయల వ్యాపారం చేస్తు తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరి పెద్ద కుమారుడు గతంలో ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. చిన్న కుమారుడు రాజబాబు తాగుడుకు బానిసగా మారి జులాయిగా తిరుగుతున్నాడు. ఈ నెల 9న మద్యం మత్తులో ఇంటికి వచ్చిన రాజబాబుకు తల్లి నాగమణి భోజనం వడ్డించగా.. తనకు వెంటనే తింటూ ఫ్రిజ్లో చల్లటి మంచినీళ్లు తేవాలని ఆమెకు చెప్పాడు. ఇంతలో కోపంతో మద్యం మత్తులో ఉన్న కొడుకు లేచి తన తల్లిని నానా