అమరావతిలో హైటెన్షన్...వైసీపీ నేతలను అడ్డుకున్న రాజధాని రైతులు
Actor ProfileCelebrity

అమరావతిలో హైటెన్షన్...వైసీపీ నేతలను అడ్డుకున్న రాజధాని రైతులు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అమరావతిలో హైటెన్షన్...వైసీపీ నేతలను అడ్డుకున్న రాజధాని రైతులు
TeluguOne1 Aug 2026
అమరావతిలో హైటెన్షన్...వైసీపీ నేతలను అడ్డుకున్న రాజధాని రైతులు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నాయకులు అమరావతి ప్రాంతంలో పర్యటించేందుకు సిద్ధమవడంతో రాజధాని రైతులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకుల పర్యటన విషయం తెలుసుకున్న ఉండవల్లి గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి వారిని అడ్డుకున్నారు. ఐదు సంవత్సరాల పాటు మూడు రాజధానుల పేరిట అమరావతిని నిర్వీర్యం చేసి, తమను ముప్పుతిప్పలు పెట్టిన వైసీపీ నాయకులకు ఇప్పుడు అమరావతి మట్టిపై అడుగుపెట్టే అర్హత లేదంటూ రైతులు తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారు. రాజధానిగా అమరావతిని పూర్తిస్థాయిలో గుర్తించాకే ఇక్కడకు రావాలని డిమాండ్ చేస్తూ "వైసీపీ నాయకులు గో బ్యాక్" అంటూ నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు రైతుల నిరసనలను బేఖాతరు చేస్తూ అన్నదాతలను తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. ఉద్రిక్తత మరింత పెరగడంతో ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. ఈ రాళ్ల దాడిలో భద్రతను పర్యవేక్షిస్తున్న ఒక పోలీస్ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడైన కానిస్టేబుల్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఉండవల్లిలోనే కాకుండా పెనుమాక, కృష్ణాయపాలెం గ్రామాల్లో సైతం రైతులు వైసీపీకి వ్యతిరేకంగా భారీ ర్యాలీలు నిర్వహించడంతో రాజధాని అంతటా ఉద్రిక్త వాతావరణం అలుముకుంది. పరిస్థితి మరింత విషమించకుండా తుళ్లూరు డీఎస్పీ నేతృత్వంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి, ఉద్రిక్తతను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.గతంలో దాదాపు 28,526 మంది రైతులు రాజధాని నిర్మాణం కోసం తమకు చెందిన సుమారు 34,385 ఎకరాల సారవంతమైన భూములను ల్యాండ్ పూలింగ్ కింద స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇచ్చారు. అయితే, గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకురావడంతో, అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలంటూ