
రైతులకు పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా సొమ్మును ఈనెల 30న అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పంటల సాగుకు ఉపయోగపడేందుకు రైతుభరోసా పేరుతో ప్రభుత్వం పెట్టుబడి సాయా న్ని అందిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు పేరుతో ఖాతాల్లో జమ చేసింది. కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన తర్వాత రైతుభరోసాగా పేరు మార్చారు. గతంలో దాదాపుగా సీజన్ ఆరంభానికే పెట్టుబడి సాయం అందగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పెట్టుబడి సాయం సరిగ్గా అందలేదు. ఆర్థికంగా ఇబ్బందులు, నిధుల కొరత కారణంగా రైతుభ రోసాను ప్రభుత్వం సరిగ్గా ఇవ్వలేకపోతుం దన్న చర్చ సాగుతోంది. - జిల్లాలో 4.50 లక్షల ఎకరాల్లో పంటలు వేసే అవకాశం బెజ్జూరు, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): రైతులకు పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా సొమ్మును ఈనెల 30న అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పంటల సాగుకు ఉపయోగపడేందుకు రైతుభరోసా పేరుతో ప్రభుత్వం పెట్టుబడి సాయా న్ని అందిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు పేరుతో ఖాతాల్లో జమ చేసింది. కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన తర్వాత రైతుభరోసాగా పేరు మార్చారు. గతంలో దాదాపుగా సీజన్ ఆరంభానికే పెట్టుబడి సాయం అందగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పెట్టుబడి సాయం సరిగ్గా అందలేదు. ఆర్థికంగా ఇబ్బందులు, నిధుల కొరత కారణంగా రైతుభ రోసాను ప్రభుత్వం సరిగ్గా ఇవ్వలేకపోతుం దన్న చర్చ సాగుతోంది. కాగా పలు సీజన్లకు రైతు భరోసాను మొత్తానికి ఇవ్వకపోగా గత యాసంగి సీజన్లో కేవలం రెండు ఎకరాలకు మాత్రమే రైతుభరోసా సొమ్మును అందించారు. ఈ వానాకా లం సీజన్కు మాత్రం పూర్తి విస్తీర్ణానికి రైతు భ రోసా ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వానాకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా సుమా రు 4.50లక్షల ఎకరాల్లో వివిద పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లా వ్యాప్తంగా లక్షా 43వేలకు పైగా రైతులు ఉన్నారు. ఇందుకు తగ్గట్టుగా