అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా
Actor ProfilePolitician

అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా - ఇలా చేయండి, వెంటనే మీ ఖాతాల్లో
Oneindia Telugu23 Jun 2026
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా - ఇలా చేయండి, వెంటనే మీ ఖాతాల్లో

ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ తో పాటుగానే అన్నాదాత సుఖీభవ పథకం కింద నిధులు జమ చేస్తోంది. అందులో భాగంగా ఈ ఆర్దిక సంవత్సరంలో తొలి విడత నిధులను తాజాగా రూ 5 వేలు ప్రభుత్వం విడుదల చేసింది. అయితే, అర్హత ఉండీ నిధులు అందని రైతులకు వ్యవసాయ శాఖ కీలక సూచనలు అందించింది.ఏపీ ప్రభుత్వం తాజాగా అన్నాదాత సుఖీభవ నిధులను విడుదల చేసింది. పీఎం కిసాన్‌ పథకం నిధులను ప్రధాని నరేంద్ర మోదీ, అన్నదాత సుఖీభవ నిధులను సీఎం చంద్రబాబు వేర్వేరుగా విడుదల చేసిన గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాలకు నగదు జమైంది. శనివారం సాయంత్రం 5గంటల సమయానికే పీఎం కిసాన్‌ నిధులు 100శాతం, అన్నదాత సుఖీభవ నిధులు 99.80శాతం రైతుల ఖాతాలకు చేరాయని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల ఇంకా జమకాని వారికి నాలుగైదు రోజుల్లో చెల్లింపులు జరుగుతాయని చెప్పారు. కాగా, ప్రభుత్వం విడుదల చేసిన అన్నదాత సుఖీభవ నిధులు కొందరు రైతులకు సాంకేతిక కారణాలతో జమ కాలేదనే సమాచారం అందుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు ఉండీ.. నగదు జమ కాకుంటే.. రైతులు ఏం చేయాలో అధికారులు సూచిస్తున్నారు. సాయికృష్ణ వ్యవహారంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం..!!నిధులు జమ కాకుంటే ఇలా చేయండిఖాతాల్లో నిధులు రాని రైతులు ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ అధికారులు భరోసా ఇస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రతీ లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాకు తప్పనిసరిగా వారి ఆధార్ కార్డు అనుసంధానమై ఉండాలని చెబుతున్నారు. బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ కాకపోతే, అలాంటి రైతులు వెంటనే తమ సంబంధిత బ్యాంకు శాఖకు వెళ్లి ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఆధార్ లింక్ సక్రమంగా ఉంటే వెంటనే పెండింగ్‌లో ఉన్న ఆ డబ్బులు ఆటోమేటిక్‌గా ఖాతాలో పడతాయని అధికారులు