
తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ రవాణా శాఖ మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడైన ఎంఆర్ విజయభాస్కర్ తాజాగా తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తూ అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్కు అధికారికంగా లేఖ సమర్పించారు. అన్నాడీఎంకేలో ఎంతో కాలంగా చురుగ్గా ఉంటూ, కరూర్ నియోజకవర్గంలో గట్టి పట్టున్న విజయభాస్కర్ లాంటి సీనియర్ నేత పార్టీని వీడటం ప్రతిపక్ష శిబిరానికి కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు. వరుస రాజీనామాలతో అసెంబ్లీలో అన్నాడీఎంకే బలం భారీగా పడిపోతోంది. ఈ వరుస పరిణామాల వెనుక తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ దూకుడు కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు టీవీకేలో చేరిపోగా, విజయభాస్కర్ రాజీనామా తదుపరి రాజకీయ దిశపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర శాసనసభలో ఒకప్పుడు బలంగా ఉన్న ప్రధాన ప్రతిపక్షం ఇప్పుడు కేవలం 44 మంది సభ్యుల బలానికి పడిపోయే పరిస్థితి వచ్చింది. గత నెలలోనే మరగతం కుమారవేల్ (మదురాంతకం), ఎస్. జయకుమార్ (పెరుందురై), పి. సత్యభామ (ధరాపురం) వంటి ముగ్గురు ఎమ్మెల్యేలు ఒకేసారి రాజీనామా చేసి అందరికీ షాక్ ఇచ్చారు. ఆ తర్వాత మాజీ ఆరోగ్య మంత్రి విజయభాస్కర్ ఐదో ఎమ్మెల్యేగా రాజీనామా చేయగా, ఇప్పుడు ఎంఆర్ విజయభాస్కర్ ఆరో వికెట్గా నిలిచారు. ఈ వరుస రాజీనామాలతో తమిళనాడులో కనీసం 5 నుండి 6 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటు అధికార డీఎంకే, ఇటు అన్నాడీఎంకేలు ఈ పరిణామాలపై గుర్రుగా ఉన్నాయి. కేవలం గుర్తింపు కోసమే శాసనసభ్యులు ఇష్టానుసారంగా రాజీనామాలు చేస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి హానికరమని లెఫ్ట్ పార్టీలు విమర్శిస్తున్నాయి. అన్నాడీఎంకే అగ్ర నాయకత్వం ఈ సంక్షోభాన్ని అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎడప్పాడి పళనిస్వామి (EPS) నాయకత్వం వహిస్తున్న ఈ తరుణంలో, సి.వి. షణ్ముగం మరియు ఎస్.పి. వేలుమణి వర్గాల మధ్య ఉన్న అంతర్గత పోరు వల్లనే ఎమ్మెల్యేలు