
అనాదిగా సముద్ర గర్భం అనంతమైన రహస్యాలకు నిలయం. తనలోకి చేరుకున్న సామ్రాజ్యాల వైభవాన్ని, శతాబ్దాల చరిత్రను అది ఎప్పటికప్పుడు కాలగర్భంలో దాచేస్తూనే ఉంటుంది. కానీ, కాలం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. ఐదు శతాబ్దాల క్రితం ఎడారి ఇసుక తిన్నెల్లో సమాధి అయిపోయిన ఒక అద్భుతమైన పోర్చుగీస్ నౌక, అందులోని కళ్లు చెదిరే భారీ నిధి కథ ఇది. నమీబియా ఎడారిలో బయటపడిన 500 ఏళ్ల నాటి బోమ్ జీసస్ (Bom Jesus) నౌక రహస్యాలు, దాని వెనుక ఉన్న అంతర్జాతీయ వాణిజ్య నెట్వర్క్ల గురించిన అత్యంత ఆసక్తికరమైన విశేషాలపై వన్ ఇండియా ప్రత్యేక కథనం.అది 1533 మార్చి 7. పోర్చుగల్ రాజధాని లిస్బన్ నగరం నుంచి బోమ్ జీసస్ అనే భారీ నౌక అపారమైన సంపదతో భారతదేశం (ఇండీస్) వైపు ప్రయాణమైంది. ఆ కాలంలో సుగంధ ద్రవ్యాలు, విలువైన వస్తువుల వాణిజ్యానికి భారత్ ప్రపంచ కేంద్రంగా ఉండేది. అయితే, ఈ నౌక తన గమ్యస్థానాన్ని చేరుకోలేదు. అట్లాంటిక్ మహాసముద్రంలో సంభవించిన ఒక ఘోర తుఫాను కారణంగా నమీబియా దక్షిణ తీరంలోని నరకప్రాయమైన ఇసుక తిన్నెల్లో చిక్కుకుని, సముద్ర గర్భంలోకి మునిగిపోయింది. దాదాపు 500 ఏళ్ల పాటు ఈ నౌక ఏమైందనేది ప్రపంచానికి ఒక పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది.కానీ, 2008లో ఒక ఊహించని అద్భుతం జరిగింది. నమీబియా తీరంలో ప్రముఖ వజ్రాల సంస్థ డి బీర్స్ కోసం పనిచేస్తున్న మైనింగ్ కార్మికులు, సముద్రజలాలను తొలగించి వజ్రాల కోసం వెతుకుతుండగా.. ఇసుక పొరల కింద ఒక భారీ చెక్క నిర్మాణం కనిపించింది. పురావస్తు శాస్త్రవేత్తలు రంగంలోకి దిగి పరిశీలించగా.. అది శతాబ్దాల క్రితం కనుమరుగైన బోమ్ జీసస్ నౌక అని తేలింది. సబ్-సహారన్ ఆఫ్రికా పశ్చిమ తీరంలో లభించిన అత్యంత ప్రాచీన, అరుదైన నౌక శిథిలం ఇదే కావడం విశేషం.13 మిలియన్ డాలర్ల బంగారం.. చెక్కుచెదరని రహస్యంఈ నౌక అంతఃగర్భం నుంచి లభించిన సంపద చూసి ప్రపంచవ్యాప్తంగా