
తమిళ సినిమా ప్రముఖ నటుడు, సంఘం జనరల్ సెక్రటరీ విశాల్ కృష్ణ తమిళనాడు నూతన ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ను చెన్నైలో మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం జరిగిన ఈ సమావేశం కేవలం ఒక సాధారణ శుభాకాంక్షల భేటీ కంటే మరింత లోతైన స్నేహాన్ని ప్రతిబింబించింది. ఈ నేపథ్యంలో విశాల్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక సుదీర్ఘమైన భావోద్వేగ నోట్ను పంచుకున్నారు. విజయ్తో తనకున్న దీర్ఘకాలిక స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన పట్ల తనకున్న అపారమైన గౌరవాన్ని, ఆప్యాయతను వ్యక్తపరిచారు. వీరిద్దరి మధ్య లయోలా కాలేజీ రోజుల నుంచే అత్యంత బలమైన స్నేహ బంధం ఉందని విశాల్ వెల్లడించారు. కాలేజీ రోజుల నుంచి తాను విజయ్ను ఎంతో ఇష్టంగా 'డార్లింగ్' అని పిలుస్తూ వస్తున్నానని గుర్తు చేసుకున్నారు. ఆ నాటి స్నేహం సినిమా రంగం నుంచి నేటి రాజకీయాల వరకు ఎంతో విజయవంతంగా కొనసాగుతోంది. విజయ్ తన టీవీకే పార్టీ ద్వారా 2026 ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్నారు. అనంతరం మే 10వ తేదీన తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కోలీవుడ్ నుంచి నటులు సిలంబరసన్, సిమ్రాన్ తదితరులు ఆయనను కలిశారు. అయితే వీరందరి కంటే విశాల్తో జరిగిన సమావేశం ఇప్పుడు ప్రత్యేకంగా అందరినీ ఆకర్షించింది. లయోలా కాలేజీలో ఒక బడ్డింగ్ స్టార్గా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు ఏకంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎదగడం అద్భుతమని విశాల్ కొనియాడారు. మౌనంతోనే అన్ని విమర్శలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరిన విజయ్ ప్రయాణం ఒక గొప్ప స్ఫూర్తి అని పేర్కొన్నారు. పదవులు మారినా విజయ్ వ్యక్తిత్వం అస్సలు మారలేదని ఈ సమావేశం ద్వారా తనకు మరోసారి అర్థమైందని విశాల్ స్పష్టం చేశారు. ఈ అపూర్వ భేటీ తనకు ఎనలేని ఆనందాన్ని ఇచ్చిందని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. గతంలో కలైగ్నర్ కరుణానిధి నుంచి జయలలిత, స్టాలిన్