వామ్మో మళ్లీ భూకంపం
Actor ProfilePolitician

వామ్మో మళ్లీ భూకంపం

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
శిథిలాలు దాచిన ప్రాణం, 18 రోజుల మృత్యుంజయురాలు
Oneindia Telugu3 Aug 2026
శిథిలాలు దాచిన ప్రాణం, 18 రోజుల మృత్యుంజయురాలు

వెనెజువెలాలో సంభవించిన భారీ భూకంపం సృష్టించిన విలయంలో ఆ కుటుంబం కళ్లముందే కుప్పకూలిన భవనం.. ప్రాణాల కోసం అల్లాడుతున్న వందలాది మంది.. ఇలాంటి విషాదకర పరిస్థితుల్లో వెలుగు చూసిన ఒక అద్భుతం ఇప్పుడు

వామ్మో మళ్లీ భూకంపం, 920 మంది మృతి
Oneindia Telugu31 Jul 2026
వామ్మో మళ్లీ భూకంపం, 920 మంది మృతి

భూమాత ఉగ్రరూపం, ప్రకృతి ప్రకోపం, నేలమట్టమైన భవనాలు.. శ్మశానాలను తలపిస్తున్న శిథిలాల.. ఎటు చూసిన మృత్యువు విలయతాండవం.. ఇది వెనిజువెలా తాజా పరిస్థితి. ఇప్పటికే తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభాలతో సతమతమవుతున్న ఆ దేశాన్ని వరుస భూకంపాలు కోలుకోలేని దెబ్బతీశాయి. తాజాగా శుక్రవారం మధ్యాహ్నం రిక్టర్ స్కేల్‌పై 4.9 తీవ్రతతో మరో భూకంపం సంభవించడంతో ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని గజగజ వణికిపోయారు. రాజధాని కారకస్, మరాకే నగరాల సమీపంలో భూమి కంపించడంతో ఇప్పటికే శిథిలాల అంచున ఉన్న భవనాలు మరింత దెబ్బతిన్నాయి. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, బుధవారం వచ్చిన జంట భూకంపాల విధ్వంసం వెనిజువెలా చరిత్రలోనే అతిపెద్ద విపత్తుగా నిలిచింది.శిథిలాల కింద అదృశ్యమైన 50 వేల మందితాజా భూకంపంతో ఆ దేశంలో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారాయి. కారకస్ నగరం, లా గువేరా రాష్ట్రం ఇప్పుడు శిథిలాల దిబ్బలుగా మారాయి. రెస్కూ ఆపరేషన్ కు తాజా ప్రకంపనలు అడ్డంకిగా మారాయి. తొలగించిన శిథిలాలపై మళ్లీ పెద్ద పెద్ద గోడలు పడగా పరిస్థితి ఘోరంగా తయారైంది. బుధవారం సాయంత్రం వచ్చిన భూకంపాల వల్ల ఇప్పటివరకు 920 మంది మరణించినట్లు అధికారికంగా ధృవీకరించగా, 3,360 మంది తీవ్రంగా గాయపడ్డారు.అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే, దాదాపు 50 వేల మంది ఆచూకీ గల్లంతైంది. వీరంతా కూలిపోయిన భవనాల శిథిలాల కింద చిక్కుకొని ఉండవచ్చని, సహాయక చర్యలు కష్టతరంగా మారాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వ్యవస్థలు బలహీనపడటంతో, నిరాశ్రయులైన వేలాది మందికి కనీసం ఆశ్రయం కల్పించలేని దుస్థితి నెలకొంది. వ్యతిరేక దిశల్లో బద్దలైన భూమి పొరలు.. ఏమిటీ డబుల్ట్ భూకంపం’?6.7 బిలియన్ డాలర్ల ఆర్థిక సంక్షోభంఐక్యరాజ్యసమితి (UN) తాజా అంచనాల ప్రకారం, ఈ ప్రకృతి విపత్తు వల్ల వెనిజువెలాకు సుమారు 6.7 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.63,000 కోట్లు) ప్రత్యక్ష నష్టం వాటిల్లింది. పరోక్ష ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ నష్టం ఇంకా

వ మ మ మళ ల భ క ప Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in