
యూపీఏ ప్రభుత్వం అప్పట్లో ప్రవేశపెట్టిన ‘మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం’ స్థానంలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్.. కానీ.. రాష్ట్ర హక్కుల పరిరక్షణకు న్యాయ పోరాటం కేంద్రం ఒంటెత్తు పోకడతో దీనిని తీసుకొచ్చింది గత్యంతరం లేక, కూలీలకు ఉపాధి కల్పించే యోచనతో రాష్ట్రంలోనూ వీబీ జీరామ్జీ అమలుకు నోటిఫికేషన్ టీచర్లు, లెక్చరర్లు, సిబ్బందికీ మధ్యాహ్న భోజనం, అల్పాహారం టిమ్స్, వరంగల్ ఆస్పత్రులకు 6,278 పోస్టుల మంజూరు మూసీ ఫేజ్1కు రూ.7,345 కోట్లతో పాలన అనుమతులు 2 జవహర్ నవోదయ విద్యాలయాలకు భూకేటాయింపులు డిస్కమ్లు పీఎఫ్సీ నుంచి తీసుకునే రూ.9 వేల కోట్ల రుణానికి పూచీకత్తు ఇవ్వడానికి ప్రభుత్వం సమ్మతి సింగరేణి, రాజస్థాన్ విద్యుత్ సంస్థల ఉమ్మడి వెంచర్కు ఓకే ఆదిలాబాద్, ములుగులో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులకు స్థలాలు సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో నిర్ణయం హైదరాబాద్, జూలై 2 (ఆంధ్రజ్యోతి): యూపీఏ ప్రభుత్వం అప్పట్లో ప్రవేశపెట్టిన ‘మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం’ స్థానంలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్(వీబీజీ-రామ్జీ)’ పథకంపై సుప్రీం కోర్టు తలుపు తట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 1 నుంచి అమల్లోకి తెచ్చిన ఈ పథకాన్ని రాష్ట్రంలోనూ అమలు చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయిస్తూనే.. న్యాయపరంగా పోరాడాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.సాయంత్రం 4 గంటల నుంచి సుదీర్ఘంగా సాగిన క్యాబినెట్ భేటీలో పలు అంశాలపై చర్చించారు. అనంతరం.. క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి మంత్రులు పొంగులేటి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్.. మీడియాకు వెల్లడించారు. గతంలో మన్మోహన్సింగ్ ప్రభుత్వం కూలీలకు ఉపాధి భద్రత