
School Holiday Tomorrow: ఇటీవలే వేసవి సెలవుల పూర్తి అయ్యి స్కూళ్లు, కాలేజీలు అన్నీ పునఃప్రారంభం అయ్యాయి. అయితే తాజాగా స్కూళ్లు, కాలేజీలకు మరో సెలవు వచ్చిపడంది. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో జూన్ 29న స్థానిక సెలవు ప్రకటించారు. పుదుచ్చేరిలోని కారైకల్ జిల్లాకు జూన్ 29న లోకల్ హాలీడేగా ప్రకటించారు. కారైకల్ అమ్మయ్యార్ ఆలయంలో జరిగే మామిడి పండు పండుగ సందర్భంగా ఈ సెలవు ప్రకటించినట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రతి జిల్లాకు స్థానిక సెలవులు ప్రకటిస్తారు. అయితే వాటిని జిల్లాలో జరిగే ఉత్సవాలు, పండుగలు, కొన్ని ప్రత్యేకమైన రోజులకు గానూ జిల్లా యంత్రాంగం స్థానిక సెలవును ప్రకటిస్తుంది. స్థానిక సెలవుల సమయంలో, ఆయా జిల్లాల్లోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నాయి. ఇతర జిల్లాల్లో అన్నీ యధావిధిగా పనిచేస్తాయి. పుదుచ్చేరిలోని కారైకల్ జిల్లాకు జూన్ 29న స్థానిక సెలవు ఇవ్వడంతో విద్యార్థులు ఆనందంలో మునిగి తేలిపోతున్నారు. ప్రసిద్ధ అమ్మయ్యార్ ఆలయం కారైకల్ జిల్లాలో ఉంది. అమ్మయ్యార్ చరిత్రను స్మరించుకుంటూ, ప్రతిఏటా అమ్మయ్యార్ ఆలయంలో మామిడి పండు ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఈ మామిడి పండు ఉత్సవానికి వేలాది మంది భక్తులు వస్తారు. జూన్ 29వ తేదీన అమ్మవారికి వివిధ పూజలు, అభిషేకాలు, ఉత్సవాలను అత్యంత ఉత్సాహంగా నిర్వహిస్తారు. దీనితో పాటు జిల్లా యంత్రాంగం సంగీత ప్రదర్శనలు, కళా ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేసింది. దీనిని వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు