
భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత వివాదాస్పద ఘట్టమైన 1975 నాటి జాతీయ అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ముచ్చట్లు ఇకపై స్కూల్ విద్యార్థులు చదువుకోనున్నారు అనే వార్త చక్కర్లు కొడుతుంది. దేశంలో ఎమర్జెన్సీ విధించి దాదాపు యాభై ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో, జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తొమ్మిదో తరగతి సామాజిక శాస్త్రం (సోషల్ స్టడీస్) సిలబస్లో ఈ అంశాన్ని ఒక ప్రత్యేక పాఠంగా చేర్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వచ్చిన Understanding Society: India and Beyond అనే కొత్త పుస్తకంలో ఈ మార్పులు చేశారని పలు వార్తా కథనాలు ప్రచురించింది జాతీయ మీడియా. ఇలా తొమ్మిదో తరగతి స్థాయిలోనే ఎమర్జెన్సీ గురించి అధికారికంగా పరిచయం చేయడం దేశంలో ఇదే మొదటిసారి.జేపీ ఉద్యమం.. హక్కుల హరణపై విశ్లేషణ:ఇంటర్నెట్, మార్కెట్లోకి వచ్చిన ఈ కొత్త బుక్స్ లో.. 1975 నుంచి 1977 మధ్య దేశంలో జరిగిన పరిణామాలను సమగ్రంగా వివరించారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో పెరిగిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం కారణంగా ప్రజల్లో వచ్చిన అసంతృప్తిని ఇందులో చర్చించారు. అలాగే కేవలం అంతర్గత కల్లోలాల సాకుతో ఎమర్జెన్సీ విధించి పౌరుల ప్రాథమిక హక్కులను రద్దు చేయడం, ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టడం, పత్రికలపై ఆంక్షలు (సెన్సార్షిప్) విధించడం వంటి ఆనాటి చీకటి రోజులను విద్యార్థులకు అర్థమయ్యేలా విశ్లేషించారు. ఈ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) నడిపిన చారిత్రాత్మక ప్రజా ఉద్యమం, యువత పోరాటం.. చివరకు 1977 ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కుతో ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుకున్నారనే విషయాలను ఇందులో ప్రముఖంగా మలిచారు.అదంతా ఫేక్ న్యూస్..ఇంటర్నెట్, మార్కెట్లో ఎన్సీఈఆర్టీ (NCERT) పేరుతో చలామణీ అవుతున్న అనధికారిక, పైరేటెడ్ (నకిలీ) పాఠ్యపుస్తకాలపై అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ప్రస్తుతం సోషల్ మీడియా, వివిధ వెబ్సైట్లు, వాట్సాప్