రూ. 10 లక్షల కోట్ల సరుకుతో నిలిచిపోయిన 1
Actor ProfilePolitician

రూ. 10 లక్షల కోట్ల సరుకుతో నిలిచిపోయిన 1

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రూ. 10 లక్షల కోట్ల సరుకుతో నిలిచిపోయిన 1,200 నౌకలు
AP7AM11 Jul 2026
రూ. 10 లక్షల కోట్ల సరుకుతో నిలిచిపోయిన 1,200 నౌకలు

ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర రవాణా మార్గమైన 'హర్మూజ్ జలసంధి'సుదీర్ఘ మూసివేతతో అంతర్జాతీయ వాణిజ్యం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. పర్షియన్ గల్ఫ్‌లో దాదాపు 125 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 10.4 లక్షల కోట్లు) విలువైన సరుకుతో ఉన్న 1,200కి పైగా సరుకు రవాణా నౌకలు అక్కడే నిలిచిపోయినట్లు సముద్ర బీమా సంస్థలు, షిప్పింగ్ డేటా నివేదికలు వెల్లడించాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఈ అంతర్జాతీయ జలమార్గం గుండా రవాణా పూర్తిగా నిలిచిపోయింది.ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురు, ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్‌జీ)లో ఐదో వంతు వాటా ఈ ఇరుకైన జలసంధి గుండానే సాగుతుంది. ఫిబ్రవరి 2026 చివరలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సైనిక దాడులు చేయడంతో ఈ సంక్షోభం ప్రారంభమైంది. జూన్ మధ్యలో అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ.. కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరిగాయంటూ ఇరాన్ చేసిన తాజా ప్రకటనలు మళ్లీ ఆందోళనలను పెంచాయి.సంక్షోభ తీవ్రత - నావికుల ఇబ్బందులుఅలియాంజ్ కమర్షియల్ సేఫ్టీ అండ్ షిప్పింగ్ నివేదిక ప్రకారం.. జూన్ మధ్య నాటికి సుమారు 29 మిలియన్ గ్రాస్ టన్నుల బరువున్న 1,150 నుండి 1,200 సరుకు రవాణా నౌకలు నిలిచిపోయాయి. వీటితో పాటు దాదాపు 20,000 మంది నావికులు నెలల తరబడి సముద్రంలోనే చిక్కుకుపోయారు. ఆహార కొరత, మానవీయ సంక్షోభం ఎదుర్కొంటున్న ఈ సిబ్బందిని సురక్షితంగా తరలించేందుకు ఒమన్ దేశం సమన్వయంతో ఒక ప్రత్యేక తరలింపు కారిడార్‌ను ఏర్పాటు చేశారు. ఉద్రిక్తతలు గరిష్ఠ స్థాయికి చేరిన సమయంలో