రేపు ఒకే వేదిక
Actor ProfilePolitician

రేపు ఒకే వేదిక

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రేపు ఒకే వేదికపైకి ఏపీ, తెలంగాణ, కర్ణాటక సీఎంలు
AP7AM12 Jul 2026
రేపు ఒకే వేదికపైకి ఏపీ, తెలంగాణ, కర్ణాటక సీఎంలు

ఏపీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు సాగు, తాగునీరు అందించే కీలకమైన తుంగభద్ర ప్రాజెక్టుకు కొత్త జవసత్వాలు రానున్నాయి. ప్రాజెక్టుకు కొత్తగా అమర్చిన స్పిల్‌వే గేట్లను రేపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ కూడా పాల్గొంటారు. మూడు రాష్ట్రాలకు చెందిన కీలక నేతల సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.తుంగభద్ర ప్రాజెక్టుకు మొత్తం రూ. 51 కోట్ల వ్యయంతో 33 కొత్త స్పిల్‌వే గేట్లను ఏర్పాటు చేశారు. 2024 ఆగస్టులో సంభవించిన వరదల సమయంలో ప్రాజెక్టు 19వ నంబర్ గేటు కొట్టుకుపోయింది. ఇది తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఆ సమయంలో సీనియర్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు నేతృత్వంలోని సాంకేతిక బృందం తాత్కాలికంగా స్టాప్-లాక్ గేటును ఏర్పాటు చేసి నీటిని నియంత్రించింది. ఈ ఘటన అనంతరం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రంగంలోకి దిగి ప్రాజెక్టును పరిశీలించింది. భద్రతా కారణాల దృష్ట్యా పాత గేట్లన్నింటినీ తొలగించి, వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది.ఈ సిఫార్సుల మేరకు ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు సంయుక్తంగా పనులు చేపట్టాయి. యుద్ధప్రాతిపదికన కేవలం ఆరు నెలల వ్యవధిలోనే 33 కొత్త గేట్ల నిర్మాణాన్ని పూర్తి చేశాయి. ఈ కొత్త గేట్ల ఏర్పాటుతో వరదల సమయంలో నీటి ప్రవాహాన్ని మరింత సమర్థవంతంగా నియంత్రించవచ్చని, నీటి వృథాను గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు తెలిపారు.రాయలసీమకు జీవనాడిగా భావించే ఈ ప్రాజెక్టు ద్వారా

ర ప ఒక వ ద క Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in