
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Ktr Slams on Telangana Congress Govt: తెలంగాణలో బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. ఎక్కడ చాన్స్ దొరికిన కూడా నేతలు ఒకరిపై మరోకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే పలు మార్లు ఆరుగ్యారంటీల అమలుపై కాంగ్రెస్ ను ఏకీపారేస్తున్నారు. ఎన్నికల్లో అమలుకు సాధ్యం కానీ 420 హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేశారని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడుతు ఎక్స్ వేదికగా సంచలన ట్విట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. 30 నెలల ముదనష్టపు పాలనలో.. దాదాపు 30 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టడమే కాకుండా మళ్లీ సభల పేరిట నాటకాలు ఆడటానికి ఏమాత్రం సిగ్గనిపిస్తలేదా ?.. అంటూ కేటీఆర్ ఏకీపారేశారు. గత రెండున్నరేళ్లలో ఎగ్గొట్టిందే ఎక్కువ అని 70 లక్షల మంది రైతులు శాపనార్థాలు పెడుతుంటే.. ఆశీర్వాద సభల పేరిట డ్రామాలా .. అంటూ విమర్శలు గుప్పించారు. కేవలం ఒక్క బటన్ నొక్కి వేయాల్సిన రైతుభరోసాకు కూడా బహిరంగ సభ పెట్టే.. నీచానికి కాంగ్రెస్ దిగజారీందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగుసార్లు రైతుభరోసా ఎగ్గొట్టిన మీ ద్రోహాన్ని రైతులు మరిచిపోతారని అనుకోవడం మీ అవివేకమని అన్నారు. ప్రతి ఎకరానికి ఏడాదికి 15 వేలు ఇస్తానని చెప్పి, చివరికి ఉన్నది ఊడగొట్టే దుస్థితి తెచ్చినందుకు ముందు ముక్కునేలకు రాయాలని డిమాండ్ చేశారు. అరకొరగా ఒకటి, రెండు ఎకరాలకు వేసినట్టు చేసి చేతులు దులుపుకుంటున్న