
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో హోంమంత్రి వంగలపూడి అనిత, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా బోయపాడు, దొండవాక తీరాల్లో నిర్మించ తలపెట్టిన రెండు ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలకు మంత్రులు శంకుస్థాపన చేశారు. అనకాపల్లి జిల్లా: పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో హోంమంత్రి వంగలపూడి అనిత, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా బోయపాడు, దొండవాక తీరాల్లో నిర్మించ తలపెట్టిన రెండు ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలకు మంత్రులు శంకుస్థాపన చేశారు. ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలకు భూమిపూజ చేయడంతో కూటమి ప్రభుత్వానికి, హోంమంత్రి అనితకు స్థానిక మత్స్యకారులు ధన్యవాదాలు తెలిపారు. ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల శంకుస్థాపన అనంతరం బోయపాడులో హోంమంత్రి వంగలపూడి అనిత సభలో ప్రసంగించారు. కొన్ని సంవత్సరాలుగా మత్స్యకార సోదరులు జెట్టి కోసం ఎదురుచూస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఏపీలో మూడు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు వస్తే, పాయకరావుపేట నియోజకవర్గానికి రెండు తీసుకువచ్చామని అనిత తెలిపారు. నియోజకవర్గంలోని మత్స్యకార సోదరులతో తనకు ఎంతో ఆప్యాయత ఉందని చెప్పారు. తాను మత్స్యకార గ్రామంలోనే టీచర్గా కూడా పని చేసినట్లు హోంమంత్రి గుర్తు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేశామని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. రెండు సంవత్సరాల కాలంలో సుమారు రూ.600 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. ఆర్ అండ్ బీ శాఖ నుంచి రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు కూడా చేశామని అనిత పేర్కొన్నారు. రాజయ్యపేట గ్రామ ప్రజలు తనను అడ్డుకున్నప్పుడు పోలీసులు కేసులు పెట్టాలని సూచించగా.. ఏ ఒక్కరిపైనా పెట్టవద్దని చెప్పినట్లు తెలిపారు. ఎన్నికల వరకే పార్టీలని, ఎన్నికలైన తర్వాత అభివృద్ధి, సంక్షేమమే ముఖ్యమన్నారు. నియోజకవర్గానికి బీసీ వెల్ఫేర్ బాలికల హాస్టల్ను తీసుకువచ్చామని, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో తొమ్మిది వేల మత్స్యకార కుటుంబాలు ఉన్నాయని