
తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఒక హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. కేవలం యూట్యూబ్ వీడియోల సమాచారాన్ని నమ్మి, ఇంట్లోనే ప్రసవం చేసుకోవడానికి ప్రయత్నించిన 32 ఏళ్ల శశికళ అనే మహిళ తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయింది.శశికళకు ఇది రెండో ప్రసవం. మొదటి కాన్పు సమయంలో ఆమెకు సిజేరియన్ అయింది. దాంతో అల్లోపతి వైద్యంపై ఒక రకమైన విరక్తి పెంచుకున్న ఆమె, ఈసారి ఎలాగైనా సహజ పద్ధతిలోనే ప్రసవం కావాలని గట్టిగా అనుకుంది. మళ్లీ సిజేరియన్ అవుతుందేమోనన్న భయంతో, ఈ కుటుంబం రెగ్యులర్ వైద్య పరీక్షలను, ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్తల సూచనలను పూర్తిగా పక్కన పెట్టేసింది. యూట్యూబ్లో వచ్చే వీడియోలను చూసి ఇంట్లోనే కాన్పు చేసుకోవాలని నిర్ణయించుకుంది.చివరకు అనుకున్నట్టుగానే శశికళ ఇంట్లోనే ఒక ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చింది. కానీ, ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. కాన్పు పూర్తయ్యాక ప్లజెంటా (మాయ)కు సంబంధించిన తీవ్రమైన సమస్యలు తలెత్తడం, విపరీతంగా రక్తస్రావం అవ్వడంతో ఆమె పరిస్థితి విషమించింది. కంగారుపడిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను పెరుందురైలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి, అక్కడి నుంచి మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ... అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో వైద్యులు ఆమెను కాపాడలేకపోయారు.ప్రస్తుతం ఆ నవజాత శిశువు సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల నుండి ఎలాంటి ఫిర్యాదు అందకపోయినప్పటికీ, పోలీసులు సుమోటోగా స్పందించి శశికళ భర్త కొలంతైసామిపై కేసు నమోదు చేశారు. సరియైన అవగాహన లేని ఆన్లైన్ ఆరోగ్య చిట్కాలు, సలహాలు నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, ప్రసవ సమయాల్లో