
నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ యోగాను భాగం చేసుకోవాలని, దీని వల్ల మానసిక ప్రశాంతం లభిస్తుందని కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఆదివారం జరిగిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. జిల్లా అదికారులు, కళాశాల అద్యాపకులు, విద్యార్థులు యోగా సాధకులతో కలిసి కలెక్టర్ యోగాసనాలు చేశారు. ఆసిఫాబాద్రూరల్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ యోగాను భాగం చేసుకోవాలని, దీని వల్ల మానసిక ప్రశాంతం లభిస్తుందని కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఆదివారం జరిగిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. జిల్లా అదికారులు, కళాశాల అద్యాపకులు, విద్యార్థులు యోగా సాధకులతో కలిసి కలెక్టర్ యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వయస్సు అనేది శరీరానికి సంబందించింది కాదని ఆది మనిషి యొక్క మనస్సుకు సంబందించినదని చెప్పారు.. ఏదైనా ఒక పనిని అసలు ప్రయత్నించకుండానే వదిలివేయడం ముసలితనానికి సంకేతమని, శారీరక ధృదత్వం లేకపోయిన కనీసం యోగా చేయడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నించాలన్నారు. యోగా వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు వివరించారు. అలాగే జిల్లా కోర్టు అవరణలో సీనియర్ సివిల్ జడ్జీ సంకేత్మిత్రా, సబ్జె ౖలులో సూపరింటెండెంట్, శ్రీ సరస్వతి శిశు మందిర్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అరిగెల నాగేశ్వర్రావుల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారు. అయా కార్యక్రమల్లో జూనియర్ సివిల్ జడ్జీ అనంతలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఆహ్మద్, బార్ ఆసోసియోషన్ అధ్యక్షుడు సతీష్బాబు, డీడీ రమాుదేవి, బీజేపీ జిల్లా ప్రదాన కార్యదర్శి మల్లిఖార్జున్, యోగా గురువు ఆశోక్ ఆచార్య తదితరులు పాల్గొన్నారు. కాగజ్నగర్, (ఆంధ్రజ్యోతి): కాగజ్నగర్ పట్టణంలో ఆదివారం