
హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ మంత్రివర్గ (Telangana Cabinet) సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో వీబీ జీరామ్జీ పథకాన్ని అమలు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన అభ్యంతరాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకుంది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు మొదటి దశకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.7,345కోట్లతో మొదటి దశ పనులు చేపట్టనున్నారు. టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో 6,278 పోస్టుల మంజూరుకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. గోదాములు, విద్యాలయాలు, సంస్థల నిర్మాణం కోసం స్థలాలు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు 1.50 లక్షల మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికి కూడా అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. హైదరాబాద్లోని ఉప్పరపల్లిలోని బార్బిక్యూనేషన్ రెస్టరంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ములుగు జిల్లా వాజేడు మండలం అటవీ ప్రాంతంలోని బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది