
ముంబైలో గురువారం చిరుజల్లుల తర్వాత మెరైన్ డ్రైవ్పై అరుదైన జంట ఇంద్రధనస్సు కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.. ఇంటర్నెట్ డెస్క్: ముంబైలోని మెరైన్ డ్రైవ్ (క్వీన్స్ నెక్లెస్) పై ఆకాశంలో గురువారం అద్భుతమైన రెండు ఇంద్రధనస్సులు (డబుల్ రెయిన్ బో) కనిపించాయి. అరేబియా సముద్రం మీదుగా వర్షం పడి ఆగిన తర్వాత ఈ మనోహరమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ముంబై వాసులు, పర్యాటకులు ఆనందంలో మునిగిపోయారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. కొద్ది సేపటికే ఈ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రస్తుతం ఈ అందమైన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ముంబైలోని మెరైన్ డ్రైవ్పై ఓ ప్రకాశవంతమైన ఇంద్రధనస్సు స్పష్టంగా కనిపిస్తుండగా.. దానిపై మరో ఇంద్రధనస్సు ఏర్పడింది. ఈ రెండు ఇంద్రధనస్సులు దృశ్యాన్ని అందరినీ అలరించాయి. మేఘాలతో నిండిన ఆకాశం, సముద్ర తీర సౌందర్యం, రంగురంగుల ఇంద్రధనస్సులు కలిసి నగరానికి మరింత అందాన్ని చేకూర్చాయి. ఈ వారం ప్రారంభంలో ముంబైలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం కురిసిన జల్లుల అనంతరం ఏర్పడిన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ అరుదైన జంట ఇంద్రధనస్సు దర్శనమిచ్చినట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు.. మంత్రి సవిత కీలక ప్రకటన