
భారత రగ్బీ హిస్టరీలోనే సరికొత్త అధ్యాయం లిఖిస్తూ సాగిన హెచ్ఎస్బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్పీఎల్) సీజన్ 2 గ్రాండ్ సక్సెస్గా ముగిసింది. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన హై వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్లో హోమ్ టీమ్ హైదరాబాద్ హీరోస్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్తో దుమ్ములేపింది. బలమైన ప్రత్యర్థి ముంబై డ్రీమర్స్ను 41-17 తేడాతో చిత్తు చేసి, ఈ సీజన్ ఛాంపియన్గా నిలిచింది. మ్యాచ్ ఆరంభంలో ముంబై కాస్త బాల్ కంట్రోల్ సాధించి జోరు చూపించినా, హైదరాబాద్ డిఫెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో నిలిచింది. పక్కా ప్లానింగ్తో కౌంటర్ ఎటాక్లకు దిగి ముంబై టీమ్కు చుక్కలు చూపించింది. విరామ సమయానికే మ్యాచ్ను పూర్తిగా తమ చేతుల్లోకి తెచ్చుకున్న హైదరాబాద్ హీరోస్, సెకండ్ హాఫ్లోనూ అదే అగ్రెసివ్ గేమ్తో టైటిల్ను ముద్దాడింది. ఆదివారం జరిగిన ఈ మెగా ఫైనల్ మ్యాచ్కు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, హైదరాబాద్ హీరోస్ జట్టుకు విన్నర్స్ ట్రోఫీని బహూకరించారు. ప్లేయర్ల స్పోర్ట్స్ మ్యాన్షిప్ను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, SARG చైర్మన్ శివసేనా రెడ్డి కూడా పాల్గొన్నారు. కేవలం రాజకీయ ప్రముఖులే కాదు, మెగాస్టార్ చిరంజీవి, ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, బాలీవుడ్ బ్యూటీ మృణాళ్ ఠాకూర్, జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రాంధి వంటి బిగ్ సెలబ్రిటీలు ఈ ముగింపు వేడుకల్లో సందడి చేయడంతో స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. ఈ వీడియోలు వైరల్ గా మారాయి. జీఎంఆర్ స్పోర్ట్స్, రగ్బీ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన ఈ టోర్నీలో ప్రైజ్ మనీ కూడా భారీగానే అందించారు. టైటిల్ విజేతగా నిలిచిన హైదరాబాద్ హీరోస్ రూ.45 లక్షల భారీ ప్రైజ్ మనీని సొంతం చేసుకోగా, రన్నరప్గా నిలిచిన ముంబై డ్రీమర్స్కు రూ.25 లక్షలు దక్కాయి. ఇక అంతకుముందు జరిగిన థర్డ్