
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. New Cabinet Ministers : కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారు మూడోసారి ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రవర్గంలో కొందరిని తప్పించి వారికి పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారు. ఇప్పటికే ఇద్దరు కేంద్ర మంత్రుల రాజ్యసభ పదవి కాలం ముగిసినా.. వారిని తిరిగి రాజ్యసభకు నామినేట్ చేయలేదు. ఈ నేపథ్యంలో రవ్నత్ సింగ్ బిట్టూ రాజ్యసభ పదవి కాలం ముగిసింది. అటు కేంద్ర మైనార్టీ వ్యవహారల మంత్రి జార్జి కురియన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు బిట్టూ రాజ్యసభ పదవి కాలం ఈ నెల21న ముగిసింది. త్వరలో బిట్టూ తన రాజీనామా సమర్పించనున్నారు. వారిని పార్టీ సేవల కోసం ఉపయోగించుకోబోతున్నట్టు సమాచారం. అంతేకాదు కేంద్ర క్యాబినేట్లో కీలకంగా ఉన్న కొందరు మంత్రులను తప్పించి కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నట్టు సమాచారం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందే ప్రధాని నరేంద్ర మోడీా క్యాబినెట్ లో భారీగా మార్పులు జరుగుతాయని తెలుస్తుంది. ఈ విషయమై ప్రధాని మోబా రాష్ట్రపతి మురుముతో నిన్న సమావేశం అయ్యారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్న మాట. అయితే.. టాప్లో ఉన్న ఆర్ధిక, విదేశాంగ, హోం, రక్షణ శాఖ మంత్రులు కాకుండా ఇతర కేంద్ర క్యాబినేట్ మంత్రులను వేరే శాఖ కేటాయించడమో.. లేకపోతో ఉద్వాసన పలకడమో చేయనున్నారు. అంతేకాదు కొంత మంత్రులు వారి పనితీరు ఆధారంగా వారని క్యాబినేట్లో కొనసాగించడమో.. లేకపోతే మంత్రి వర్గం నుంచి తొలిగించి పార్టీ సేవలకు ఉపయోగించుకోవాలని