
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Women Health: చాలా మంది మహిళలు.. తరచుగా కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం లేదా తరచుగా టాయిలెట్కు వెళ్లడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ప్రతిరోజూ తీసుకునే ఆహారం లేదంటే బలహీనమైన జీర్ణక్రియ అనుకుని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ కొన్నిసార్లు ఇది ప్రాణాంతకం అవుతుంది. ఇది ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ సంకేతం అయ్యే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇదొక తీవ్ర సమస్య. ఈ వ్యాధితో బాధపడేవారికి ప్రేగులు సరిగ్గా పనిచేయవు. కడుపు సంబంధిత సమస్యలు పదే పదే ఇబ్బంది పెడుతుంటాయి. ఈ సమస్య పురుషుల కంటే స్త్రీలలోనే ఎక్కువ కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీనికి కారణాలెన్నో ఉన్నాయి. శరీరంలో జరిగే కొన్ని సహాజ మార్పులు, ఒత్తిడి వల్ల కూడా ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉందంటున్నారు. మహిళల్లో ఐబీఎస్ ప్రమాదం ఎందుకు ఎక్కువగా ఉంటుందో తెలుసుకుందాం. హార్మోన్ల మార్పులు: వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళల శరీరంలో ఎప్పటికప్పుడు జరిగే హార్మోన్ల మార్పులు వారి జీర్ణవ్యవస్థ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయి. ఈ కారణంగానే మహిళల పేగులు సున్నితంగా మారుతాయి. ఇది కడుపు నొప్పి, గ్యాస్, మలబద్ధకం లేదా విరేచనాలు వంటి సమస్యలకు దారితీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెలసరి సమయం: అయితే చాలా మంది మహిళలు నెలసరి సమయంలో ఎక్కువ కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుంటారు. కొందరిలో.. ఈ సమస్య గర్భధారణ సమయంలో లేదా మెనోపాజ్ సమయంలో కూడా తీవ్రతరం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ సమయాల్లో శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. ఇవి జీర్ణక్రియను కూడా ప్రభావితం చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఒత్తిడి : మన