మహబూబ్ నగర్ లో మైనార్టీ గురుకుల భవనాలు.. ప్రారంభించిన మంత్రి అజారుద్దీన్
Actor ProfilePolitician

మహబూబ్ నగర్ లో మైనార్టీ గురుకుల భవనాలు.. ప్రారంభించిన మంత్రి అజారుద్దీన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మహబూబ్ నగర్ లో మైనార్టీ గురుకుల భవనాలు.. ప్రారంభించిన మంత్రి అజారుద్దీన్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి
Vaartha21 Jun 2026
మహబూబ్ నగర్ లో మైనార్టీ గురుకుల భవనాలు.. ప్రారంభించిన మంత్రి అజారుద్దీన్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి

Mahabubnagar Minority Gurukul School: చదువుతోనే ప్రతీ ఒక్కరికీ ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుంది. విద్యార్థులు క్రమశిక్షణతో, కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలి. ముఖ్యంగా సమాజంలో ఒక తరం అభివృద్ధి చెందాలంటే బాలికల విద్య ఎంతో అవసరం. రాష్ట్రంలోని మైనార్టీ గురుకుల విద్యా సంస్థలలో కార్పొరేట్ స్థాయి వసతులను ప్రభుత్వం కల్పిస్తోంది” అని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం బోయపల్లిలో రూ. 20 కోట్ల భారీ వ్యయంతో నూతనంగా నిర్మించిన ‘తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల భవనం-1’తో పాటు, రూ. 2 కోట్ల 10 లక్షలతో నిర్మించిన ‘బాలికల వసతి గృహం (హోస్టల్) భవనాన్ని’ శనివారం మంత్రి మహ్మద్ అజారుద్దీన్.. ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మరియు మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణలతో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ విద్యార్థుల సంక్షేమానికి పూర్తి కట్టుబడి ఉందన్నారు. ప్రాథమిక స్థాయిలో పొందే విద్యా ప్రమాణాలే ఉన్నత విద్యకు బలమైన పునాది అని, గురుకులాల విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత ఉద్యోగాలు సాధించి జిల్లాకు పేరు తేవాలని పిలుపునిచ్చారు. చదువుతో పాటు విద్యార్థుల ఆరోగ్యం కూడా ముఖ్యమని, గురుకులాలలో నాణ్యమైన పౌష్ఠికాహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పాలనలో మైనారిటీ పాఠశాలలకు సొంత భవనాలు లేక అద్దె భవనాలలో విద్యార్థులు నానా ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా పూర్తిగా వినియోగించకుండా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి చొరవతో కేంద్రానికి నివేదికలు పంపి, నిధులు విడుదల చేయించి ఈ భవన

మహబ బ నగర ల మ న ర ట గ ర క ల భవన ల ప ర ర భ చ న మ త ర అజ ర ద ద న Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in