Upcoming IPOs: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పెద్దగా పబ్లిక్ ఇష్యూలు రాలేదు. అంతర్జాతీయంగా అనిశ్చితులు తలెత్తడంతో చమురు ధరలు భారీగా పెరిగాయి. డాలర్ పెరగడంతో రూపాయి విలువ జీవనకాల కనిష్ఠాలకు పడిపోయింది. ఇవన్నీ స్టాక్ మార్కెట్లలో సెంటిమెంటును బలహన పరిచాయి. ఇన్ని ఊగిసలాటల మధ్య పబ్లిక్ ఇష్యూలకు రావాలనుకున్న చాలా కంపెనీలు వెనకడుగు వేశాయి. అయితే, ఇప్పుడు పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. ఇరాన్- అమెరికా మధ్య డీల్ కుదిరినట్లు వస్తున్న వార్తలతో దాడులు సైతం తగ్గాయి. చమురు ధరలు దిగివచ్చాయి. దీంతో స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ అయ్యేందుకు డజనుకు పైగా కంపెనీలు సిద్ధమయ్యాయి. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. రూ.60 వేల కోట్లుగత ఏడాదిలో ఇప్పటి వరకు ఐపీఓల ద్వారా ఏకంగా 3.5 బిలియన్ డాలర్ల పైనే అంటే దాదాపు రూ.33,500 కోట్ల నిధులను కంపెనీలు సమీకరించాయి. గత 2 ఏళ్లలో రికార్డ్ స్థాయిలో 20 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.1.90 లక్షల కోట్లకు పైగా నిధులను సమీకరించాయి. ఈ రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది 2026లో ఐపీఓల ద్వారా నిధుల సమీకరణ చాలా తక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, వచ్చే 2 నెలల్లో ప్రాథమిక మార్కెట్ కాస్త పుంజుకోనుందన్న వార్తలు ఊరట కల్పిస్తున్నాయి. తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ), సంస్థాగత మదుపరులకు షేర్ల కేటాయింపు, ప్రభుత్వ వాటాల విక్రయాలకు సంబంధించిన ఇష్యూల ద్వారా డజనుకు పైగా కంపెనీలు దాదాపు రూ.60 వేల కోట్ల మేర నిధులను సమీకరించే అవకాశం ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు స్తబ్ధుగా కొనసాగిన మార్కెట్కు ఈ ఐపీఓలు మళ్లీ పునరుత్తేజాన్ని తీసుకురావచ్చు. లిస్ట్లో ఉన్న ప్రధాన కంపెనీలు ఇవేవచ్చే కొన్ని నెలల్లో పబ్లిక్ ఇష్యుకు రానున్న కంపెనీలలో ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ కంపెనీ (SBI Mutual Fund) అత్యధికంగా రూ.13 వేల కోట్ల నిధులను సమీకరించనుందని సమాచారం. మలివిడత
Actor ProfilePolitician
మళ్లీ మొదలైన ల సందడి.. 12 కంపెనీలు
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•14 Jun 2026
మళ్లీ మొదలైన ల సందడి.. 12 కంపెనీలు, రూ.60 వేల కోట్లు.. లిస్ట్ లో , సహా దిగ్గజ