
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Indian Railway New History: భారత రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఎనర్జీ టార్గెట్గా ప్రతిష్టాత్మకంగా రూపొందించిన దేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కింది. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్ నుంచి నిర్వహించిన ట్రైయిల్ రన్ సక్సెస్ అయింది. గంటకు 120 కి.మీ వేగంతో ట్రయల్ రన్ సక్సెస్ .. గంటకు 120 కి.మీ గరిష్ట వేగంతో ప్రయాణించింది. అయితే, ప్రస్తుతం వాడుకలో ఉన్న డీజిల్ రైళ్లకు ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్ రైళ్లను ఇండియన్ రైల్వేస్ ప్రవేశపెడుతోంది. వీటి పనితీరును కొన్నేళ్లు గమనించాకా.. దశల వారీగా డీజిల్ రైళ్లకు బదులు హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ టెక్నాలజీ.. ఈ రైళ్లలో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ టెక్నాలజీని ఉపయోగించినట్టు అధికారులు తెలిపారు. ఇవి హైడ్రోజన్, ఆక్సిజన్లను కలిపి విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి. దీంతో రైలు నడిచేటప్పుడు పర్యావరణానికి హాని చేసే ఎలాంటి కర్భన ఉద్గారాలు వెలుబడవు. సో.. పర్యావరణ అనుకూలమైనది. ఎలాంటి పొగ బయటకు రాదు. కేవలం నీరు, ఆవిరి మాత్రమే బయటకు వదలుతుంది. హైడ్రోజన్ ట్రైయిన్ ట్రయల్ రన్.. హైడ్రోజన్ ఆధారిత ట్రైన్ స్పీడ్ ట్రయల్ విజయవంతంగా ముగిసిన వెంటనే అది సర్వీసులోకి రానుంది. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా దేశంలోని పర్యాటక, చారిత్రాత్మక మార్గాలైన షిమ్లా-కల్కా, డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే వంటి నారో గేజ్, హెరిటేజ్ రూట్లలో కూడా ఇలాంటి మరో 35 హైడ్రోజన్ రైళ్లను