
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Scissors found in pregnant woman ashes in bhadradri kothagudem mother and her child death tragedy: సాధారణంగా వైద్యుల్ని చాలా మంది దేవుళ్లుగా భావిస్తారు. తల్లి జన్మనిస్తే వైద్యులు పునర్జన్మని ఇస్తారని చెప్తారు. అందుకే వైద్యో నారాయణో హరీ అని చాలా మంది ప్రగాఢంగా నమ్ముతారు. కానీ కొంత మంది వైద్యులు మాత్రం పవిత్రమైన తమ వృత్తికి మాయని మచ్చలా మారుతున్నారు. ట్రీట్మెంట్ కు వచ్చిన వారిని వేధించడం, డబ్బుల విషయంలో దారుణంగా ప్రవర్తిస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. మరికొంత మంది డబ్బులు చెల్లించిన కూడా ట్రిట్మెంట్ విషయంలో పూర్తిగా నెగ్లీజెన్సీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో ఇటీవల ఒక బాలింతతో పాటు, శిశువు కూడా చనిపోయిన ఘటనలో తీవ్ర విషాదకరంగా మారింది. దీనిలో మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభూనిగూడెం గ్రామంలో వనజ(20) అనే గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. స్థానికంగా అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సు సాధారణ కాన్పు చేసింది. అయితే...ఆమె అవగాహన రాహిత్యం వల్ల శిశువు అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రిలో తల్లి వనజ కూడా చికిత్స పొందుతూ మరణించించింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు తల్లికి, బాలింతలను ఇంటికి తీసుకెళ్లారు. ఆతర్వాత వారికి దహనసంస్కారాల కార్యక్రమం నిర్వహించారు. మరుసటి రోజు తల్లి చితాభస్మం సేకరించడానికి శ్మశానంకు వెళ్లారు. అందులో శస్త్ర చికిత్సకు వాడే కత్తెర