బంగ్లా తో చైనా ఒప్పందాలు.. భారత్ ఆందోళన ఏంటి? చైనా ఏమంది
Actor ProfilePolitician

బంగ్లా తో చైనా ఒప్పందాలు.. భారత్ ఆందోళన ఏంటి? చైనా ఏమంది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బంగ్లా తో చైనా ఒప్పందాలు.. భారత్ ఆందోళన ఏంటి? చైనా ఏమంది
Sakshi15 Aug 2026
బంగ్లా తో చైనా ఒప్పందాలు.. భారత్ ఆందోళన ఏంటి? చైనా ఏమంది

చైనా, బంగ్లాదేశ్‌ ఇటీవల 13 ఒప్పందాలపై సంతకాలు చేసుకున్న విషయం తెలిసిందే. తీస్తా సహా తదితర నదుల నిర్వహణలో పరస్పర సహకారం కోసం ఈ ఒప్పందాలు జరిగాయి. దీనిపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో దీని గురించి చైనా స్పందించింది. తీస్తా నది నిర్వహణ, పునరుద్ధరణ ప్రాజెక్టు (టీఆర్‌సీఎంఆర్‌పీ) విషయంలో బంగ్లాదేశ్‌కు తమ మద్దతు ఉంటుందని చైనా మరోసారి స్పష్టం చేసింది. బంగ్లాదేశ్‌తో చేసుకున్న తమ ఒప్పందం ఏ మూడో దేశాన్ని లక్ష్యంగా చేసుకున్నది కాదని చైనా తెలిపింది. బీజింగ్‌లో మీడియాతో చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్‌ మాట్లాడుతూ.. "చైనా-బంగ్లాదేశ్‌ సహకారం ఏ మూడో దేశాన్నీ లక్ష్యంగా చేసుకోదు. చైనా-బంగ్లాదేశ్‌ సహకారంలో ఏ మూడో దేశం జోక్యం ఉండకూడదు" అని చెప్పారు. ఈశాన్య ప్రాంతానికి సమీపంలో నది తీస్తా నది పరివాహక ప్రాంతం భారత్‌ ఈశాన్య ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉంది. ఇదే భారత్‌ ఆందోళన వ్యక్తం చేయడానికి కారణం. తీస్తా నదికి సమీపంలో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్‌, అంటే చికెన్‌ నెక్‌ ప్రాంతం ఉండటమే భారత్‌ ఆందోళనకు ప్రధాన కారణం. ఆ ప్రాంతంలో, ముఖ్యంగా చైనా ఉనికి పెరగడం, భారత్‌ భద్రతా ఆందోళనలను పెంచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దేశ ఈశాన్య ప్రాంతాన్ని మిగతా భారతదేశంతో కలిపే ఈ కారిడార్‌ విషయంతో సమస్యలు ఏర్పడే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు. ఆ నదీ ప్రాజెక్టు బంగ్లాదేశ్‌ ప్రజల జీవనోపాధికి ఉపయోగపడే ప్రాజెక్టు అని చైనా పేర్కొంటోంది. "తీస్తా నది సమగ్ర నిర్వహణ, పునరుద్ధర ప్రాజెక్టు అనేది బంగ్లాదేశ్‌ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ప్రజల జీవనోపాధి ప్రాజెక్టు. దీనికి సాధ్యమైనంత సాయం అందించడానికి చైనా సిద్ధంగా ఉంది" అని జియాకున్‌ చెప్పారు. "అభివృద్ధి వ్యూహాల్లో బంగ్లాదేశ్‌తో మరింత సమన్వయం సాధించడానికి, ఆర్థికం, వాణిజ్యం, జల సంరక్షణ, ప్రజల జీవనోపాధి వంటి రంగాల్లో పరస్పర

బ గ ల త చ న ఒప ప ద ల భ రత ఆ ద ళన ఏ ట చ న ఏమ ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in