
టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది ఈ హీరోయిన్. ప్రభాస్, అల్లు అర్జున్, రవితేజ వంటి స్టార్ హీరోలతో వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలు చేసింది. దీంతో ఆమె వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ సాఫ్ట్ వేర్ రంగంలో దూసుకుపోతుంది. ఆమె ఇప్పుడు ఇతర నటీనటులకు భిన్నంగా తన కెరీర్ ఎంచుకుంది. ఆమె మరెవరో కాదు.. దీక్షా సేత్. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 2010లో అల్లు అర్జున్, మంచు మనోజ్ కలిసి నటించిన వేదం చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ప్రభాస్ సరసన రెబల్ చిత్రంలో కనిపించింది. అలాగే రవితేజతోనూ పలు చిత్రాల్లో నటించి ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకుంది. దీక్ష నటి కావాలని ఎప్పుడూ అనుకోలేదు. ఆమె తండ్రికి కోల్కతా, చెన్నై, ముంబై, కాఠ్మండు, గుజరాత్, రాజస్థాన్ వంటి నగరాల్లో కార్పొరేట్ బదిలీల కారణంగా ఆమె బాల్యం ఆయన వెంటే గడిచిపోయింది. నిరంతర ప్రయాణాలు మారుతున్న వాతావరణాలకు అలవాటుపడింది. కాలేజీ నాటికి, ఆమె సముద్ర పురావస్తు శాస్త్రాన్ని చదవాలనుకుంది. ఎక్కువ మంది చదివినవి : Athadu Movie : అతడు సినిమా హిట్ అవ్వడానికి కారణం ఆయనే.. నాజర్ కామెంట్స్.. సముద్ర గర్భం, పురాతన ఓడల శిధిలాలు, నీటి అడుగున చరిత్ర పట్ల ఆమెకు అమితమైన ఆసక్తి ఉండేది.ఒక ఎన్ఎస్ఎస్ కార్యక్రమంలో స్కౌట్ ఆమెను గమనించడంతో ఆమె జీవితం మారిపోయింది. దీక్ష ఒక ఫ్యాషన్ పోటీలో ఫ్రెష్ ఫేస్ టైటిల్ గెలుచుకుంది. హైదరాబాద్లో ఒక మోడలింగ్ అసైన్మెంట్ సమయంలో, దర్శకుడు కృష్ణ ఆమెను చూసి, తన రాబోయే సినిమాలో ఒక పాత్రకు ఆమె సరిపోతుందని భావించారు. ఆ సినిమానే 'వేదం'. ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆమె.. ఆ తర్వాత రవితేజ జోడిగా మిరపకాయ్ చిత్రంలో నటించింది. తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె..వరుస అవకాశాలు వస్తున్న సమయంలోనే













































