
Revanth Reddy:రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉండాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం తక్కువ అనే భావన తల్లిదండ్రులు వదిలేయాలని ఆయన కోరారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ బడులను తీర్చిదిద్ది మట్టిలో మాణిక్యాలను వెలికితీయడమే ప్రభుత్వ ధ్యేయమని సీఎం స్పష్టం చేశారు. విద్యపై ప్రభుత్వం భారీగా పెట్టుబడి పెడుతోంది. అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం. నాణ్యమైన చదువుతోనే సమాజంలో అసమానతలు తొలగిపోతాయని సీఎం వివరించారు. Read also: Pawan Kalyan Meets Niranjan: అభిమాని కోరిక తీర్చిన ఉపముఖ్యమంత్రి! గతంలో కులం పేరుతో ప్రత్యేక పాఠశాలలు పెట్టి వివక్ష చూపారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అలాంటి కుల వ్యవస్థను నిర్మూలించే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తోంది. విద్యను కేవలం ఖర్చుగా కాకుండా సమాజ భవిష్యత్తు కోసం చేసే పెట్టుబడిగా చూడాలని ఆయన సూచించారు. ప్రభుత్వ బడులలో చదివిన ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా స్థిరపడ్డారని గుర్తు చేశారు. నెలలకే చిరిగిపోయే యూనిఫాంలు కాకుండా నాణ్యమైన విద్యా కిట్లను ప్రభుత్వం అందిస్తోంది. సమాజంలో ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందాలనే లక్ష్యంతోనే విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ఈ పబ్లిక్ స్కూళ్ల ప్రధాన ఉద్దేశమని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి విద్యార్థికి ఆధునిక విద్యను అందిస్తూ వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. విద్యా రంగంలో మార్పులు తీసుకురావడం ద్వారా అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం అన్నారు. క్రీడల్లో స్ఫూర్తిని నింపడానికి మెస్సీ లాంటి క్రీడాకారులను ఆహ్వానిస్తే కొందరు విమర్శలు చేయడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలు సమాజ హితం కోసం జరుగుతున్నాయని