
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Electric vehicle sales in June 2026: భారత ప్రధాని మోదీ చెప్పిన ఒకే ఒక మాటతో యావత్ దేశం ముందుకు దూసుకుపోతోంది. బంగారం అత్యవసరం అయితే కొనుగోలు చేద్దామన్న ప్రధాని విజ్ఞప్తి.. దేశంలో పసిడి కొనుగోళ్లు 70శాతం వరకు పడిపోయేలా చేసింది. మోదీ మాటలో అర్థం ఉందంటూ జనాలు కూడా ఆలోచిస్తున్నారు. అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఇంధన కరువు దేశాన్ని కుదిపేసింది. ఈ సమయంలోనే మోదీ మరో విజ్ఞప్తి చేశారు.. ఇంధనాన్ని పొదుపుగా వాడుదాం.. ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుదాం.. ఇంధన సమస్యలకు పరిష్కారంతోపాటు.. వాతావరణానికి మేలు జరుగుతుందన్న ఒక సందేశంతో.. జనాలు ఈవీల వైపు పరుగులుపెట్టారు. దీంతో భారత ఆటో రంగం కార్ల అమ్మకాలతో దూసుకుపోతోంది. గత జూన్.. ప్రస్తుతం సంవత్సరం మొదటి త్రైమాసిక గణాంకాలను పరిశీలించినట్లయితే ఈవీలను కొనుగోలు చేయడంలో జనాలు మరింత ఆసక్తి చూపించారు. టాటా మోటార్స్ గత జూన్ లో 12వేలకు పైగా ఈవీలను విక్రయించి ఆగ్రస్థానంలో నిలిచింది. హీంద్రా & మహీంద్రా 7645 యూనిట్లు, JSW MG మోటార్ 5785 యూనిట్లు, మారుతి సుజుకి 1896 యూనిట్లు, విన్ఫాస్ట్ 1394 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించాయి. దేశీయ బ్రాండ్స్ కే జనాలు బ్రహ్మరథం పట్టారన్న సంగతి స్పష్టం అవుతోంది. మీరు కూడా ఒక కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. గత జూన్ నెలలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల రిపోర్టును ఒకసారి చూడండి. టాటా మోటార్స్: టాటా మోటార్స్ జూన్లో మొత్తం 12,025 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2027 మొదటి త్రైమాసికంలో ఈ దేశీయ సంస్థ