
బాలీవుడ్ ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ తెలుగు ఆడియెన్స్ కు కూడా పరిచయమే. పవన్ కల్యాణ్ పంజా సినిమాలో విలన్ గా చేశాడు. అలాగే సాహో సినిమాలో ప్రభాస్ తండ్రిగా కనిపించారు. సినిమాల పరంగా జాకీష్రాఫ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో హీరోగా ఓ వెలుగు వెలిగిన ఈయన ఇప్పటికీ సినిమాల్లో నటిస్తున్నారు. విలన్ గా, సహాయక నటుడిగా మెప్పిస్తున్నారు. అయితే జాకీష్రాఫ్ కేవలం వెండితెర హీరో మాత్రమే కాదు. నిజ జీవితంలో కూడా ఆయన హీరోనే. ఒక విషయంలో అందరూ ఈ జాకీని తెగ ప్రశంసిస్తున్నారు. ఈ నటుడికి ఇప్పుడు కోట్లాది ఆస్తులున్నాయి. విశాలమైన భవనాలు, లగ్జరీ కార్లు ఉన్నాయి. కొడుకు (టైగర్ ష్రాఫ్) కూడా హీరోగా రాణిస్తున్నాడు. ఇలా ఎన్ని కోట్ల ఆస్తులున్నా జాకీ ష్రాఫ్ తన మూలాలను మర్చిపోలేదు. ఎందుకంటే ఆయన జీవిత ప్రస్థానమే కటిక పేదరికంలో మొదలైంది. పేదరికంలో ఉండే బాధ లను ఆయన స్వయంగా చూశాడు. . జాకీ తన బాల్యాన్ని ముంబైలోని వాల్కేశ్వర్ ప్రాంతంలో గడిపారు. చిన్న ఇంటిలోనే అందరూ ఉండేవారు. రాత్రి నిద్రపోతున్నప్పుడు ఎలుకలు తన వేళ్లను కొరికాయని ఒక ఇంటర్వ్యూలో గుర్తు తెచ్చుకున్నాడు జాకీ ష్రాఫ్. ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ జాకీ జీవితాన్ని గొప్పగా మలచుకోవాలని కలలు కన్నాడు. ఇందుకోసం చేతికొచ్చిన పని చేశాడు. పల్లీలు అమ్మాడు, ఫ్లైట్ అటెండెంట్గా పని చేశాడు, చెఫ్గా ట్రై చేశాడు. చివరకు ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘాయ్ బస్టాండ్ లో నిల్చొని ఉన్న జాకీని చూసి వెంటనే తన 'హీరో' చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఇక ఆ తర్వాత ఆయన వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. జాకీ ష్రాఫ్ స్టార్ అయినా ఇప్పటికీ తన మూలాలు మర్చిపోలేదు. అందుకే ఇప్పటికీ తన సంపాదనలో కొంత భాగం పేదలకు దానం చేస్తున్నాడు. ఎక్కడైతే నిస్సహాయుడు కనిపిస్తాడో, అతనికి అండగా నిలబడటానికి తన వంతు ప్రయత్నం