
తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు ఊపందుకుంటున్నాయి. బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత, కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన (TRS) పేరిట సరికొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, పార్టీని ప్రకటించినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రజాదరణ లభించకపోవడం, క్యాడర్ ఆశించిన మేర యాక్టివ్ కాకపోవడంతో కవిత తన రాజకీయ వ్యూహాన్ని మార్చినట్లు కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ఆమె టార్గెట్ చేయడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఏదైనా కొత్త పార్టీ ప్రాంతీయంగా నిలదొక్కుకోవాలంటే బలమైన లీడ్ లేదా సంచలనాల అవసరం ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్యే ప్రధాన రాజకీయం నడుస్తోంది. ఈ తరుణంలో తన ఉనికిని చాటుకోవడానికి, నిరంతరం వార్తల్లో నిలిచేందుకు కవిత సరికొత్త పంథాను ఎంచుకున్నట్లు అర్థమవుతోంది. అందులో భాగమే పవన్ కల్యాణ్ లక్ష్యంగా సాగుతున్న విమర్శలు. పవన్ కల్యాణ్ కేవలం ఒక రాజకీయ నాయకుడే కాదు, తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో. ఆయన్ను విమర్శిస్తే సహజంగానే అటు అభిమానులు, ఇటు జనసైనికులు సోషల్ మీడియా వేదికగానో, క్షేత్రస్థాయిలోనో గట్టిగా కౌంటర్ ఇస్తారు. ఈ వివాదం ద్వారా తన కొత్త పార్టీ ‘టీఆర్ఎస్’ పేరు జనంలోకి వెళ్తుందనేది కవిత ఆలోచనగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత కొద్ది రోజులుగా పవన్ కల్యాణ్ను ఉద్దేశించి కవిత చేస్తున్న వ్యాఖ్యలు ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. పవన్ కల్యాణ్ తెలంగాణలో రాజకీయాలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని, ఇక్కడికి వస్తే తరిమికొడతామని కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన సినిమాలు చూసి ఆనందిస్తాం కానీ, రాజకీయంగా ఇక్కడ జోక్యం చేసుకుంటే సహించబోమంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా ఇడుపు కాయితం సినిమా చుట్టూ జరుగుతున్న వివాదంలోకి కూడా పవన్ కల్యాణ్ను అనవసరంగా లాగడం