
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం రాపో 23 అధికారికంగా లాంచ్ చేశారు. ఎన్నో ఏళ్ల పాషన్, ప్లానింగ్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రంతో హీరో రామ్ దర్శకుడిగా అరంగేట్రం


ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం రాపో 23 అధికారికంగా లాంచ్ చేశారు. ఎన్నో ఏళ్ల పాషన్, ప్లానింగ్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రంతో హీరో రామ్ దర్శకుడిగా అరంగేట్రం

రామ్ పోతినేని హీరోగా ‘రాపో 23’ తెరకెక్కుతున్న సంగతి తెలిసింది. ఈ చిత్రంతో రామ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్పై కృష్ణ పోతినేని నిర్మిస్తున్నారు. రామ్ పోతినేని హీరోగా ‘రాపో 23’ తెరకెక్కుతున్న సంగతి తెలిసింది. ఈ చిత్రంతో రామ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్పై కృష్ణ పోతినేని నిర్మిస్తున్నారు. సోమవారం ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది. అనంతరం నిర్మాత కృష్ణ పోతినేని రామ్కు స్ర్కిప్ట్ అందజేశారు. ముహూర్తపు సన్నివేశానికి పి.వి. రవికిషోర్ క్లాప్ కొట్టారు. పి.మురళీ మోహన్ కెమెరా స్విఛ్చాన్ చేయగా.. దర్శకుడిగా తన కొత్త ప్రయాణానికి శ్రీకారం చుడుతూ రామ్ పోతినేని స్వయంగా దర్శకత్వం వహించారు. నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ శివార్లలో మొదలు కానుందని మేకర్స్ చెప్పారు. నియో-నోయర్ బ్యాక్డాప్లో సాగే సైకలాజిక్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న చిత్రమిది. ఇప్పటి వరకు తెలుగు తెరపై చూడని విభిన్న అంశాలను, ఆసక్తికరమైన పాత్రల ప్రయాణంతో ఈ చిత్రం ఉండబోతోందని రామ్ తెలిపారు. హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించడం సవాల్తో కూడిన పని అని రామ్ పేర్కొన్నారు. ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం పలువురు ప్రముఖ నటీనటులను ఎంపిక చేస్తున్నారు. ఇతర వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. ఈ సినిమాకు అత్యున్నత స్థాయి సాంకేతిక బృందం పని చేస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత తిరునావుకరసు (తిరు) సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, పీటర్ హెయిన్స్ యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు. ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు

ఐక్యూ ఫోన్లో శాంసంగ్ డిస్ప్లే కూడా ఉండొచ్చు భారీ 6.8-అంగుళాల డిస్ప్లేతో రావొచ్చు ఈ ఫోన్లో అమోల్డ్ ప్యానెల్ ఉంటుందని అంచనా iQOO 16T : కొత్త ఐక్యూ ఫోన్ కొంటున్నారా? మీకోసం అతి త్వరలో ఐక్యూ 16T

ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ తన వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. ఆస్ట్రేలియా మార్కెట్లో తన ప్రధాన ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా విద్యార్థులు, బడ్జెట్ ప్రియులు

Apple price hike | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ తన మ్యాక్బుక్ (MacBook), ఐప్యాడ్ (iPad) ధరలను భారీగా పెంచేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్ల విస్తరణ కారణంగా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫెడరల్ న్యాయ వ్యవస్థపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన పరిపాలనా నిర్ణయాలు, ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా కోర్టుల నుంచి వరుసగా వస్తున్న ప్రతికూల తీర్పులపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా వాషింగ్టన్‌లోని చారిత్రాత్మక కెన్నెడీ సెంటర్ వివాదం, టారిఫ్‌లపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన తప్పుబట్టారు. మన రాజకీయ వ్యవస్థ ఎంత అవినీతిమయంగా మారిందో.. కోర్టుల వ్యవస్థా అంతే దారుణంగా, మోసపూరితంగా తయారైంది అంటూ శనివారం తన సొంత సోషల్‌ మీడియా వేదిక ట్రూత్‌ సోషల్‌’లో ట్రంప్ ఘాటుగా పోస్టు చేశారు. దేశ ప్రజలకు ఈ వాస్తవాలన్నీ తెలుసని, అందుకే వారు తనను భారీ మెజారిటీతో అధ్యక్షుడిగా గెలిపించారని పేర్కొన్న ఆయన.. దేశ ప్రయోజనాల కోసం చివరివరకు పోరాడతానని స్పష్టం చేశారు.ట్రంప్‌కు డబుల్‌ స్ట్రోక్‌.. ప్రతిష్టకు భంగంఇరాన్‌తో దౌత్యపరమైన చిక్కులు ఎదుర్కొంటున్న తరుణంలోనే, ట్రంప్‌కు శుక్రవారం న్యాయస్థానాల నుంచి రెండు ప్రధాన ఎదురుదెబ్బలు తగిలాయి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (MAGA) ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి, ఫెడరల్ సంస్థలను పునర్నిర్మించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలకు ఈ తీర్పులు తీవ్ర ఆటంకంగా మారాయి. వాషింగ్టన్ డిస్ట్రిక్ట్ జడ్జి క్రిస్టోఫర్ కూపర్ సంచలన ఆదేశాలు జారీ చేస్తూ.. కెన్నెడీ సెంటర్ ఫర్ ది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ భవన ముఖభాగం, అధికారిక సామగ్రి, బ్రాండింగ్ నుంచి ట్రంప్ పేరును రెండు వారాల్లోగా తొలగించాలని స్పష్టం చేశారు. అలాగే, రెండేళ్ల పునరుద్ధరణ ప్రాజెక్టు నెపంతో ఈ వేసవిలో సాంస్కృతిక కేంద్రాన్ని మూసివేయాలన్న ప్రతిపాదనను కూడా జడ్జి నిలిపివేశారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అధికారం కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని న్యాయమూర్తి స్పష్టం చేయడం.. వాషింగ్టన్‌లోని ప్రముఖ సంస్థపై తన ముద్ర వేయాలనుకున్న

దిల్లీ: సుప్రీం కోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల నియామకాల విషయంలో న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య ఎలాంటి ఘర్షణ వాతావరణం లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్రాం మేఘ్వాల్ స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థలో ఖాళీల భర్తీకి చక్కటి సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఆదివారం ఆయన పీటీఐతో మాట్లాడారు. న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి వివిధ దేశాలు అనుసరిస్తున్న విధానాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ అధ్యయనానికి ఎలాంటి అధికారిక కమిటీని ఏర్పాటు చేయలేదని, అనధికారికంగానే దీన్ని చేపట్టినట్లు వివరించారు. అందులో వెల్లడయ్యే అంశాల గురించి ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. కొలీజియం విధానానికి ప్రత్యామ్నాయాన్ని తీసుకొస్తారా అన్న ప్రశ్నకు ఆయన ఇలా స్పందించారు. న్యాయమూర్తుల నియామకాల్లో కొన్నిసార్లు కేంద్రం ప్రతిపాదించిన పేర్లను సుప్రీం కోర్టు కొలీజియం తిరస్కరించిన సందర్భాలున్నాయని, అదే విధంగా కొలీజియం ప్రతిపాదించిన పేర్లను కేంద్రం తిరస్కరించిందని గుర్తు చేశారు. ఆ జాబితాల్లోని వ్యక్తుల నేపథ్య చరిత్ర సక్రమంగా లేకపోవడంలాంటివి అందుకు కారణాలు కావొచ్చన్నారు. కొలీజియం వ్యవస్థను రద్దు చేస్తూ దాని స్థానంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసేందుకు వీలు కల్పించే బిల్లును గతంలో పార్లమెంటు ఆమోదించింది. అయితే సుప్రీం కోర్టు దాన్ని కొట్టివేసిన సంగతి తెలిసిందే. న్యాయ వ్యవస్థల్లో 5 కోట్లకుపైగా కేసులు పెండింగ్లో ఉండటంపై మేఘ్వాల్ స్పందిస్తూ.. వాటి పరిష్కారానికి తమ ప్రభుత్వం ప్రత్యామ్నాయ యంత్రాంగంపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు /

ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల రూపురేఖలను మార్చేలా కూటమి ప్రభుత్వం సరికొత్త విప్లవాత్మక వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. రాష్ట్రంలో వ్యవసాయ రంగ ఆధునీకరణ, మార్కెటింగ్ నెట్వర్క్ బలోపేతం, మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో వ్యవసాయం, అనుబంధ శాఖలు, ప్రాథమిక రంగాల మిషన్లపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం పలు సంచలన ప్రకటనలు చేశారు. 90 నియోజకవర్గాల్లో కొత్త రైతుబజార్ల ఏర్పాటు, 'ఫార్మ్ టు హోమ్' విధానం, ఆక్వా రంగానికి భారీ విద్యుత్ రాయితీలు, మత్స్యకారులకు రూ.240 కోట్లతో మరపడవలు లాంటి చారిత్రాత్మక నిర్ణయాలకు ఈ భేటీలో ఆమోదం లభించింది. రైతులు పండించిన కూరగాయలు, పండ్లను దళారుల ప్రమేయం లేకుండా, తక్కువ వ్యయంతో నేరుగా వినియోగదారుల ఇళ్లకే చేర్చేలా 'ఫార్మ్ టు హోమ్' (Farm to Home) అనే సరికొత్త విధానాన్ని అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ల (FPOs) ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. దీనితో పాటు రాష్ట్రంలోని 90 నియోజకవర్గాల్లో కొత్తగా అత్యాధునిక రైతుబజార్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఉన్న రైతుబజార్లను పూర్తిగా ఆధునికీకరించి, 'డిజి రైతుబజార్ యాప్'ను విస్తృతం చేయాలని స్పష్టం చేశారు. రైతుబజార్లు, ప్రైవేటు మార్కెట్లలో 'ప్రకృతి సేద్యం' (Natural Farming) ఉత్పత్తుల కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఆక్వా రంగాన్ని 'బ్లూ ఎకానమీ'గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ సబ్సిడీలను ప్రకటించింది. ప్రస్తుతం ఆక్వా రంగానికి యూనిట్కు రూ.1.50 చొప్పున ఇస్తున్న విద్యుత్ సబ్సిడీని.. ఇప్పటికే ఉన్న 50 వేల కనెక్షన్లతో పాటు కొత్తగా నమోదైన 12,680 కనెక్షన్లకు కూడా వర్తింపజేయాలని సీఎం ఆదేశించారు. దీనికోసం ప్రభుత్వం