
నీట్ పరీక్షలో మాల్ప్రాక్టీస్ విద్యార్థి అరెస్ట్. వాష్రూమ్లో ఫోన్ దాచి అక్రమాలు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు. Neet Exam 2026: హైదరాబాద్ శివార్లలోని ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రాగన్నగూడ జెడ్పీహెచ్ఎస్ పరీక్ష కేంద్రంలో నీట్ (Neet Exam 2026) పరీక్ష రాస్తూ మాల్ప్రాక్టీస్కు పాల్పడిన 18 ఏళ్ల విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు పరీక్ష ప్రారంభానికి ముందే, అంటే ఉదయం 7 గంటలకే కేంద్రానికి చేరుకుని ఒక పక్కా ప్లాన్ అమలు చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు తన మొబైల్ ఫోన్ను ఒక జిప్లాక్ కవర్లో పెట్టి, వాష్రూమ్లోని ఫ్లష్ ట్యాంక్ వెనుక గల వెంటిలేటర్లో అత్యంత చాకచక్యంగా దాచిపెట్టాడు. ఆ తర్వాత కేంద్రం ఎంట్రీ వద్ద భద్రతా సిబ్బంది రెండు సార్లు కఠినమైన తనిఖీలు నిర్వహించినప్పటికీ, అతడి వద్ద ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు లేకపోవడంతో లోపలికి అనుమతించారు. Donald Trump: బ్రిటన్ ప్రధాని స్టార్మర్ రాజీనామా.. సంచలనంగా మారిన డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికి, ఆ విద్యార్థి తనకు తీవ్రమైన కడుపు నొప్పిగా ఉందంటూ ఇన్విజిలేటర్లను నమ్మించి వాష్రూమ్కు వెళ్లాడు. అయితే, అతను వెళ్లిన చాలా సేపటి వరకు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఇన్విజిలేటర్లు లోపలికి వెళ్లి పరిశీలించారు. అక్కడ సదరు విద్యార్థి వెంటిలేటర్ నుండి మొబైల్ ఫోన్ తీసి, గూగుల్ క్రోమ్ ద్వారా నీట్ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ రెడ్హ్యాండెడ్గా దొరికిపోయాడు. దీంతో వెంటనే అలర్ట్ అయిన పరీక్షా కేంద్రం సిబ్బంది ఫోన్ను స్వాధీనం చేసుకుని, పోలీసులకు సమాచారం అందించారు. స్కూల్ యాజమాన్యం ఇచ్చిన అధికారిక ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థిని అదుపులోకి తీసుకుని విచారించగా, అతను తన నేరాన్ని అంగీకరించాడు. ఈ అక్రమ ఉదంతంపై పోలీసులు బీఎన్ఎస్ (BNS) సెక్షన్ 318(4)తో పాటు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు