
`పెదకాపు` ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం `నాగబంధం`. ఈ మూవీకి ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. నిక్ స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ పతాకాలపై కిశోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఇందులో జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ, రామచంద్రరాజు, అనసూయ వంటి వారు ఇతర పాత్రలు పోషించారు. నేడు శుక్రవారం(జులై 3న) సినిమా విడుదలైంది. భారీ స్కేల్లో ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్గా రూపొందిన ఈ మూవీకి ప్రమోషన్స్ తో హైప్ క్రియేట్ చేశారు. మరి ఆ స్థాయిలో సినిమా ఉందా? హడావుడి చేసిన స్థాయిలో సినిమా ఆకట్టుకుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. మరణాన్ని జయించే శక్తి కోసం మనిషి తపించే కథలతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అదే సమయంలో ఈ సృష్టిని శాసించాలనే కథలతోనూ సినిమాలు వస్తున్నాయి. ఈ సృష్టించిన శాసించే శక్తి కోసం, ఆ శక్తి ఉన్న బ్రహ్మకమలం కోసం చేసే పోరాటమే ఈ సినిమా.1962 సమయంలో ఆర్కియాలజిస్ట్ ప్రభాకర్(జగపతిబాబు) ఎన్నో కొత్త విషయాలు కనిపెడతారు. అదే సమయంలో ఆయనకు అంతుచిక్కని విషయాలు కూడా ఉంటాయి. అందులో ఒకటి నాగబంధం రహస్యం. ఇలాంటి సమయంలో తన అల్లుడు ఎవరికీ అంతుచిక్కని నాగబంధానికి సంబంధించిన పుస్తకాన్ని తీసుకొస్తాడు. ఇదే విషయంపై పీఎంని కలవాలనుకుంటారు. అయితే ఆ పుస్తకం ద్వారా బ్రహ్మకమలం ఎక్కడుందో కనిపెడతారు. అది రంగనాథస్వామి దేవాలయంలో విష్ణువు వద్ద ఉంటుంది. దాన్ని దొంగిలించేందుకు కుట్రలు చేస్తారు. ఎట్టకేలకు దొంగిలిస్తాడు. ఇందులో ప్రభాకర్ పాత్ర కూడా ఉంటుంది. మరోవైపు రుద్ర(విరాట్ కర్ణ)కి చెల్లి అంటే ప్రాణం. ఆమె పెళ్లి విషయంలో మేనత్త(అనసూయ) కుటుంబం సమస్య చేస్తారు. కానీ చివరికి ఓకే చెబుతారు. కానీ కొడుకు మాత్రం ఊరుకోడు. సరిగ్గా పెళ్లిరోజు విధ్వంసం సృష్టిస్తాడు. అందుకు విలన్ అయిన అలీ(రిషబ్ సహానీ)తో చేతులు కలుపుతాడు. అతను బ్రహ్మకమలం కోసం