ధాన్యం సేకరణలో రికార్డ్స్ బ్రేక్ చేసిన తెలంగాణ సర్కార్
Actor ProfileCelebrity

ధాన్యం సేకరణలో రికార్డ్స్ బ్రేక్ చేసిన తెలంగాణ సర్కార్

Total News1
Movie Updates0
Sources1
ధాన్యం సేకరణలో రికార్డ్స్ బ్రేక్ చేసిన తెలంగాణ సర్కార్
Vaartha14 Jun 2026
ధాన్యం సేకరణలో రికార్డ్స్ బ్రేక్ చేసిన తెలంగాణ సర్కార్

Paddy Procurement : తెలంగాణ వ్యవసాయ రంగ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ధాన్యం సేకరణ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త రికార్డులను సృష్టించింది. 2025-26 మార్కెటింగ్ సీజన్‌కు గాను రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో దాదాపు 150 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని ప్రభుత్వం విజయవంతంగా కొనుగోలు చేసింది. ఈ భారీ సేకరణ ప్రక్రియ ద్వారా రాష్ట్రంలోని 26.43 లక్షల మంది రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరింది. రైతులు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేయడమే కాకుండా, వారి శ్రమకు తగ్గట్టుగా రూ.35,537 కోట్ల భారీ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసింది. గతంలో ధాన్యం అమ్ముకున్న తర్వాత డబ్బుల కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుత ప్రభుత్వం కేవలం 48 నుంచి 72 గంటల వ్యవధిలోనే (రెండు మూడు రోజుల్లోనే) నిధులను రైతుల ఖాతాల్లోకి చేర్చి, వారి ఆర్థిక అవసరాలకు అండగా నిలబడింది. Read Also : విప్లవం, సనాతనం.. ఇదే మా విధానం – పవన్ కళ్యాణ్ ఇంతటి భారీ స్థాయిలో ధాన్యం సేకరించడం సామాన్యమైన విషయం కాదు, దీని వెనుక తెలంగాణ ప్రభుత్వ పక్కా వ్యూహం, పకడ్బందీ నిర్వహణ ఉన్నాయి. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు మొదలుకొని.. ధాన్యం రవాణా (ట్రాన్స్‌పోర్టేషన్), గోదాముల్లో నిల్వ చేయడం, రైస్ మిల్లింగ్ ప్రక్రియ మరియు చివరి ఘట్టమైన నగదు చెల్లింపుల వరకు ప్రతి ఒక్క దశను ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించింది. పౌరసరఫరాలు, రవాణా, వ్యవసాయ శాఖలు ఒకదానితో ఒకటి పూర్తి సమన్వయంతో, ఒక గొలుసుకట్టు వ్యవస్థలా పనిచేయడం వల్లే ఈ రికార్డు స్థాయి విజయం సాధ్యమైందని ప్రభుత్వం వివరించింది. ఎక్కడా దళారుల జోక్యం లేకుండా, లీకేజీలకు తావులేకుండా సాంకేతికతను జోడించి చేపట్టిన ఈ ధాన్యపు జాతర దేశంలోనే తెలంగాణను మరోసారి ఆదర్శంగా నిలిపింది. Today Gold Rate: నేడు స్థిరంగా