తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ లో ఇన్
Actor ProfilePolitician

తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ లో ఇన్

📊 Box Office Collections
Total News3
Movie Updates0
Sources1
వ్యూహం మార్చిన గులాబీ బాస్, కీలక నిర్ణయం - కలిసొచ్చేనా
Oneindia Telugu15 Aug 2026
వ్యూహం మార్చిన గులాబీ బాస్, కీలక నిర్ణయం - కలిసొచ్చేనా

తెలంగాణ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కాంగ్రెస్ - బీఆర్ఎస్ పోటా పోటీగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. రెండున్నారేళ్ల పాలన పూర్తయిన తరువాత రేవంత్ తన రూటు మార్చారు. వచ్చే ఎన్నికల కోసం

తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ లో ఇన్ - ఔట్.. ఊహించని నిర్ణయం
Oneindia Telugu12 Aug 2026
తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ లో ఇన్ - ఔట్.. ఊహించని నిర్ణయం

ప్రధాని మోదీ తన కేబినెట్ ను పూర్తిగా ప్రక్షాళన దిశగా కసరత్తు చేస్తున్నారు. త్వరలో జరిగే కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు... మోదీ 4.0 టార్గెట్ గా ఈ మార్పులు చేర్పులకు రంగం సిద్దం చేస్తు న్నారు. ప్రభుత్వంతో పాటుగా పార్టీలోనూ మార్పులు జరగనున్నాయి. పలువరు సీనియర్ల శాఖలు మారటంతో పాటుగా.. కొందరు మంత్రులకు ఉద్వాసన ఖాయంగా కనిపిస్తోంది. ఇక, తెలంగాణ నుంచి మార్పులు చేర్పుల పైన స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి.కేంద్ర కేబినెట్ వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు ముందే జరగటం ఖాయమైంది. కేబినెట్ లో కొందరు సీనియర్లకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారు. ఇద్దరికి గవర్నర్ గా అవకాశం దక్కటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక.. సీనియర్ల శాఖల్లోనూ మార్పులు జరగనున్నాయి. మిత్రపక్షాలతో పాటుగా అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కనుంది. ఇక, తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ లో ప్రస్తుతం ఒక క్యాబినెట్, ఒక సహాయ మంత్రి పదవులు ఉండగా, రాబోయే ఎన్నికల వ్యూహంలో భాగంగా మూడో వ్యక్తికి అవకాశం కల్పించడం ద్వారా సామాజిక సమతుల్యత ను సాధించాలని అధిష్ఠానం యోచిస్తోంది. మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకునేందుకు పలువురు సీనియర్ నాయకులు ఎవరి ధీమాతో వారు ఉన్నారు. ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అర్వింద్, నగేశ్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ఇద్దరు మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ విషయంలోనూ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.కేబినెట్ ప్రక్షాళన లో కొత్త ఫార్ములా, వీరు అవుట్ - కొత్త గవర్నర్లుగా.. కీలక శాఖలు వీరికే..!!సామాజిక లెక్కలకు ప్రాధాన్యత ఇస్తూకిషన్ రెడ్డికి శాఖ మార్పు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. బండి సంజయ్ ను మంత్రిగా కొనసాగిస్తారా.. పార్టీలో నితిన్ నబీన్ టీంలోకి తీసుకొస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. కాగా, కిషన్ రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే సామాజిక సమీకరణాల్లో భాగంగా డీకే అరుణకు ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది. కాగా

రైతు భరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం కొత్త నిర్ణయం, దరఖాస్తు చేసుకోండి
Oneindia Telugu12 Aug 2026
రైతు భరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం కొత్త నిర్ణయం, దరఖాస్తు చేసుకోండి

రైతు భరోసా నిధుల విడుదల పై కీలక అప్డేట్. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా అమలులో కొత్త వారికి అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఇందు కోసం దరఖాస్తు

త ల గ ణ న చ క ద ర క బ న ట ల ఇన Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in