తెలంగాణలో 100 మంది వీఐపీలకు సెక్యూరిటీ తగ్గింపు.. జులై 1 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు
Actor ProfilePolitician

తెలంగాణలో 100 మంది వీఐపీలకు సెక్యూరిటీ తగ్గింపు.. జులై 1 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తెలంగాణలో 100 మంది వీఐపీలకు సెక్యూరిటీ తగ్గింపు.. జులై 1 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు
Samayam Telugu31 Jul 2026
తెలంగాణలో 100 మంది వీఐపీలకు సెక్యూరిటీ తగ్గింపు.. జులై 1 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు

ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను, ఆ తర్వాత తెలంగాణలోని పలు సరిహద్దు ప్రాంతాలను వణికించిన వామపక్ష తీవ్రవాద సమస్య ఇప్పుడు దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు, ముప్పు పూర్తిగా అదుపులోకి రావడంతో ఇన్నాళ్లూ వివిధ రంగాల ప్రముఖులకు, రాజకీయ నాయకులకు కల్పిస్తూ వచ్చిన అదనపు భద్రతను భారీగా తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర అత్యున్నత భద్రతా సమీక్ష కమిటీ (సెక్యూరిటీ రివ్యూ కమిటీ) క్షేత్రస్థాయి పరిణామాలను నిశితంగా పరిశీలించి ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సవరించిన కొత్త భద్రతా నిబంధనలు జులై 1వ తేదీ నుంచి అధికారికంగా అమలులోకి రానున్నాయి.రాష్ట్రంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి భద్రతా సమీక్ష కమిటీ అత్యవసరంగా సమావేశమై.. నిఘా విభాగం అందించే రహస్య సమాచారం ఆధారంగా వీఐపీల భద్రతను పునఃసమీక్షిస్తుంది. కొత్తగా ఎవరెవరికి ప్రాణహాని ఉంది? ఎవరికి కొత్తగా భద్రత కల్పించాలి ? ప్రస్తుతం భద్రత కలిగి ఉన్నవారిలో ఎవరికి ఎంత మేరకు రక్షణ కొనసాగించాలి, ఎవరికి తగ్గించాలి లేదా పూర్తిగా తొలగించాలి ? అనే విషయాలపై ఈ కమిటీ క్షుణ్ణంగా మదింపు చేస్తుంది. ఇందులో భాగంగానే రెండు రోజుల క్రితం ఇంటెలిజెన్స్ చీఫ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ సమావేశమైంది. ఈ తాజా సమీక్షలో రాష్ట్రవ్యాప్తంగా 100 మందికి పైగా ప్రముఖుల భద్రతను భారీగా తగ్గించినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది.ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వివిధ కేటగిరీల కింద దాదాపు 600 మంది ప్రముఖులకు ప్రభుత్వం గన్‌మెన్లు, పీఎస్‌వోల రూపంలో రక్షణ కల్పిస్తోంది. ఇందులో ప్రజాప్రతినిధులు, గతంలో మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్న కొందరికి బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనాలను కూడా ప్రభుత్వమే సొంత ఖర్చులతో సమకూరుస్తోంది. అయితే, దేశంలో మావోయిస్టుల ప్రభావం గణనీయంగా తగ్గిందని త్వరలోనే దేశం పూర్తిస్థాయిలో మావోయిస్టు రహితంగా మారుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణకు చెందిన ఒకరిద్దరు అగ్రనేతలు మినహా